EPACK Durables IPO: 19న ఈప్యాక్ డ్యూరబుల్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.218-230
EPACK Durables IPO: రూ.640 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్ ఐపీఓకి వస్తోంది.
EPACK Durables IPO | ఈప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్ ఐపీఓ (IPO) జనవరి 19న ప్రారంభమై 23 వరకు కొనసాగనుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.218-230గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.640 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఐపీఓ (EPACK Durables IPO) జనవరి 18 నుంచే అందుబాటులోకి రానుంది.
ఈప్యాక్ డ్యూరబుల్స్ ఐపీఓలో (EPACK Durables IPO) రూ.400 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేస్తున్నారు. మరో 1.3 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సభ్యులు, వాటాదారులు విక్రయిస్తున్నారు. ఈ ఐపీఓలో (IPO) సమీకరించిన నిధులను తయారీ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన మూలధన వ్యయం, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీఓలో సగం షేర్లను అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs) కేటాయించారు. 35 శాతం రిటైల్ మదుపరులకు, 15 శాతం సంస్థాగతేతర మదుపరులకు (NIIs) రిజర్వ్ చేశారు.
ఈప్యాక్ డ్యూరబుల్స్ను 2002లో స్థాపించారు. ఇది ఏసీలతో పాటు గృహోపకరణాలను తయారు చేస్తుంటుంది. 2022 సెప్టెంబర్లో ఈ కంపెనీ తొలి విడతలో ఐసీఐసీఐ వెంచర్ నుంచి 24 మిలియన్ డాలర్లను సమీకరించింది. రెండో విడతలో అఫిర్మా క్యాపిటల్ నుంచి 40 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. యాక్సిస్ క్యాపిటల్, డామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ ఐపీఓకి (EPACK Durables IPO) బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.ఈ ఐపీఓ మెయిన్బోర్డు తరగతికి చెందినది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.