HDFC: విలీన అనుమతికి హెచ్డీఎఫ్సీ దరఖాస్తు
హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద దరఖాస్తు చేసినట్లు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ శనివారం వెల్లడించింది.
దిల్లీ: హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద దరఖాస్తు చేసినట్లు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ శనివారం వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీన ప్రతిపాదనలో ఇది భాగమేనని పేర్కొంది. దీనికి ఎన్సీఎల్టీ, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తదితర చట్టబద్ధ, నియంత్రణ సంస్థల అనుమతులతో పాటు వాటాదార్లు, ఆయా కంపెనీల క్రెడిటార్ల ఆమోదం తప్పనిసరని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఈ విలీన ప్రతిపాదనకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విలీన ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీలు ప్రకటించాయి. 40 బిలియన్ డాలర్లతో (సుమారు రూ.3.16 లక్షల కోట్లు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీని విలీనం చేసుకోబోతోంది. ఈ ప్రక్రియను 18 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాయి.
ఫ్రాంక్ఫర్ట్, పారిస్కు మరిన్ని విమానాలు
డ్రీమ్లైనర్ను లీజుకు తీసుకున్న విస్తారా
దిల్లీ: బోయింగ్కు చెందిన 787-9 డ్రీమ్లైనర్ విమానాన్ని విస్తారా లీజుకు తీసుకుంది. దిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్, పారిస్కు విమానాల సంఖ్యను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విస్తారా తొలిసారిగా లీజుకు తీసుకున్న డ్రీమ్లైనర్ విమానం ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే బోయింగ్ నుంచి కొనుగోలు చేసిన రెండు డ్రీమ్లైనర్ విమానాలను కంపెనీ వినియోగిస్తోంది. మరో నాలుగు డ్రీమ్లైనర్ విమానాలను డెలివరీ చేయాల్సి ఉన్నా.. బోయింగ్ అలా చేయలేకపోవడంతో లీజుకు తీసుకోవాల్సి వచ్చింది. డెలివరీలను పునః ప్రారంభించే ముందు డ్రీమ్లైనర్ ఉత్పత్తి లైనును సరిదిద్దాలని అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) ఆదేశించడం ఇందుకు కారణం. 2018లోనే విస్తారా ఆరు డ్రీమ్లైనర్లకు ఆర్డరు పెట్టింది. అయితే రెండే ఇప్పటిదాకా వచ్చాయి. రెండో విమానాన్ని అందించిన ఆగస్టు 2020 నుంచీ మిగతా వాటి కోసం విస్తారా ఎదురుచూస్తోంది. అక్టోబరు 30 నుంచి దిల్లీ-ఫ్రాంక్ఫర్ట్కు వారానికి ఆరు విమానాలను నడపనుంది. ప్రస్తుతం వారానికి మూడు మాత్రమే నడుపుతోంది. అలాగే దిల్లీ-పారిస్ మార్గంలో వారానికి రెండు బదులుగా అయిదు విమానాలను మొదలుపెట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్