భారత్ వృద్ధి అంచనాలు పైకి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మళ్లీ పెంచింది. జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
2022-23లో 6.9 శాతం
ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మళ్లీ పెంచింది. జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్జాతీయ కుదుపుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని బ్యాంకు పేర్కొంది. రెండో త్రైమాసికం వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదుకావడమూ వృద్ధి అంచనాలను సవరించడానికి కారణంగా వివరించింది. 2023-24లో భారత వృద్ధి రేటు కాస్త నెమ్మదించి 6.6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. కాగా.. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత వృద్ధి రేటు అంచనాలను పెంచిన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ ప్రపంచ బ్యాంకు కావడం గమనార్హం. 2022-23కు భారత వృద్ధి రేటు అంచనాను తొలుత 7.5% గా ప్రకటించినా, గత అక్టోబరులో 6.5 శాతానికి ప్రపంచ బ్యాంకు తగ్గించిన సంగతి తెలిసిందే.
ద్రవ్యలోటు లక్ష్యాన్ని భారత్ సాధిస్తుంది
ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 6.4% లోపునకు కట్టడి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించేలా కనిపిస్తోందని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. పన్నుల వసూళ్లలో బలమైన వృద్ధే ఇందుకు కారణమని పేర్కొంది. ఇంధనంపై పన్ను రేట్లలో కోత విధించినప్పటికీ.. జీఎస్టీ వసూళ్ల అండతో తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ జీడీపీ వృద్ధిని భారత్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఎరువులు, ఆహార రాయితీలకు ప్రభుత్వం వ్యయ కేటాయింపులు పెంచినప్పటికీ.. 2022-23లో 6.4% ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుంది. సాధారణ ప్రభుత్వ లోటు 2021-22లోని 10.3 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గుతుంద’ని ప్రపంచబ్యాంకు నివేదిక వివరించింది. ఈ నివేదిక ప్రకారం ..
* 2022-23లో ప్రభుత్వ అప్పు జీడీపీలో 84.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2020-21లో ఇది 87.6 శాతంగా ఉంది.
* కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 9.5 శాతం వృద్ధి ఉండగా.. వ్యయాలు 12.2 శాతం పెరుగుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 2022-23 తొలి అర్ధభాగంలో ద్రవ్యలోటు వార్షిక లక్ష్యంలో 37.3 శాతానికి చేరింది. కిందటేడాది ఇదే సమయంలోని 35 శాతం కంటే ఇది ఎక్కువ.
* 2020-21లో కరెంటు ఖాతా మిగులు ఉండగా... 2021-22లో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.1 శాతానికి చేరింది. 2022-23లో ఇది మరింత పెరగనుంది. దిగుమతులు పెరగడమే ఇందుకు కారణం.
* 2022-23 మొదటి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) జీడీపీలో 1.6 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. 2021-22లో ఇవి సగటున 1.2 శాతంగా నమోదయ్యాయి.
* విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల (ఎఫ్పీఐలు) పెట్టుబడులు నికరంగా జీడీపీలో 1.7 శాతం మేర వెనక్కి వెళ్లిపోయాయి.
* ఇటీవలి కాలంలో కమొడిటీ ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అదుపులోకి రానున్నాయి.
* ఈ ఏడాదిలో విదేశీ మారకపు నిల్వలు సుమారు 13 శాతం తగ్గినప్పటికీ.. ఎనిమిది నెలలకు సరిపడా దిగుమతుల విలువకు ఇవి సరిపోతాయని తెలిపింది. గత నాలుగు త్రైమాసికాల్లో మొత్తం దిగుమతులను ఆధారంగా చేసుకొని ఈ లెక్కగట్టింది.
* ఇతర వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత రూపాయిపై ఒత్తిడి స్తబ్దుగానే ఉండే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!