వెల్లువెత్తిన అమ్మకాలు
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి.
సమీక్ష
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. జనవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 81.65 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.31 శాతం తగ్గి 85.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్ లాభపడగా, హాంకాంగ్, షాంఘై పనిచేయలేదు. ఐరోపా సూచీలు మిశ్రమంగా కదలాడాయి.
సెన్సెక్స్ ఉదయం 60,834.73 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాలు కొనసాగడంతో ఏదశలోనూ కోలుకోలేకపోయిన సూచీ.. ఇంట్రాడేలో 60,081.36 పాయింట్లకు పడిపోయింది. చివరకు 773.69 పాయింట్ల నష్టంతో 60,205.06 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 226.35 పాయింట్లు క్షీణించి 17,891.95 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,846.15- 18,100.60 పాయింట్ల మధ్య కదలాడింది.
* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో టీవీఎస్ మోటార్ షేరు 5.18% లాభపడి రూ.1037.30 దగ్గర స్థిరపడింది.
* బలహీన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇండస్ టవర్స్ షేరు 7.36% నష్టంతో రూ.157.95; యునైటెడ్ స్పిరిట్స్ షేరు 5.91% నష్టపోయి రూ.768.75 దగ్గర ముగిసింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 24 కుదేలయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.63%, ఎస్బీఐ 4.30%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.78%, యాక్సిస్ బ్యాంక్ 2.02%, హెచ్డీఎఫ్సీ 2.02%, టెక్ మహీంద్రా 1.87%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.78%, అల్ట్రాటెక్ 1.63%, ఎల్ అండ్ టీ 1.45%, బజాజ్ ఫిన్సర్వ్ 1.36%, రిలయన్స్ 1.33% చొప్పున నష్టపోయాయి. మారుతీ, హెచ్యూఎల్, టాటా స్టీల్, ఐటీసీ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్ 2.87%, విద్యుత్ 2.72%, బ్యాంకింగ్ 2.42%, ఆర్థిక సేవలు 2.11%, టెలికాం 2.06%, చమురు-గ్యాస్ 1.76%, స్థిరాస్తి 1.92%, యంత్ర పరికరాలు 1.06% పడ్డాయి. బీఎస్ఈలో 2492 షేర్లు నష్టాల్లో ముగియగా, 1037 స్క్రిప్లు లాభపడ్డాయి. 117 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* మధురై కేంద్రంగా పనిచేసే ఐటీ సేవల కంపెనీ ఎస్ఎంఐను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇందుకు అప్ఫ్రంట్, వాయిదా ఈక్విటీ రూపేణా రూ.111 కోట్లు చెల్లించనుంది.
* వచ్చే మూడేళ్లలో కొత్త ఉత్పత్తులు, పవర్ట్రైన్ అభివృద్ధి కోసం 25 మిలియన్ యూరోల (దాదాపు రూ.220 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు విద్యుత్ ద్విచక్రవాహన సంస్థ ఒకినవా ఆటోటెక్ ప్రకటించింది.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొదటిసారిగా రూ.8,000 కోట్ల విలువైన సార్వభౌమ హరిత బాండ్లను బుధవారం వేలంలో విక్రయించింది. అయిదేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ బాండ్లకు కూపన్ రేటు 7.10 శాతంగా ఉంది. అయిదేళ్ల సార్వభౌమ బాండ్ల రాబడులతో పోలిస్తే ఇది 5 బేసిస్ పాయింట్ల తక్కువ.
నేడు మార్కెట్లకు సెలవు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు (గురువారం) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. బులియన్, ఫారెక్స్, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు