ఆర్బీఐ కఠిన నిబంధనలే బ్యాంకులకు రక్ష
భారతీయ బ్యాంకులు వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్నాయని, ఇందుకు ఆర్బీఐ నిరంతర పర్యవేక్షణ, కఠిన నిబంధనలే కారణమని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ అన్నారు. ‘అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశ వృద్ధిపై కొంత ప్రభావం పడొచ్చ’ని పేర్కొన్నారు.
సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్
ఈనాడు, హైదరాబాద్: భారతీయ బ్యాంకులు వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్నాయని, ఇందుకు ఆర్బీఐ నిరంతర పర్యవేక్షణ, కఠిన నిబంధనలే కారణమని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ అన్నారు. ‘అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశ వృద్ధిపై కొంత ప్రభావం పడొచ్చ’ని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సీఐఐ దక్షిణ ప్రాంత వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గత 25 ఏళ్లుగా దేశంలో భౌతిక, డిజిటల్ మౌలిక వసతులు ఎంతో అభివృద్ధి చెందినందున, ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అందించే దిశగా మన పరిశ్రమ సాగాలని ఉద్బోధించారు.
రుణాలకు ఇబ్బంది లేదు: అమెరికా, ఐరోపాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతపై స్పందిస్తూ.. భారతీయ బ్యాంకులు ఎంత బలంగా ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఇదని అన్నారు. ‘ప్రస్తుతం విదేశాల్లో రుణ లభ్యత కష్టంగా మారినా, ఇది స్వల్పకాలమే. దేశంలో మంచి కంపెనీలు, అంకురాలకు రుణాలు పెద్ద సమస్యే కాదు. మంచి ఆలోచనలు, వ్యాపారాలకు ప్రపంచ వ్యాప్తంగా తగినంత మూలధనం అందుబాటులో ఉంది’ అని అన్నారు.
అత్యాశ వద్దు: ఫిన్టెక్ అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు, బీమా సంస్థలు అత్యుత్సాహం చూపొద్దని ఆయన సూచించారు. కొన్ని అంకురాలు బాగానే పనిచేస్తున్నా, తమ విలువను ఎన్నో రెట్లు అధికంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘అందువల్ల వృద్ధిని మాత్రమే కాకుండా, ఆయా సంస్థల్లోని నష్టభయాలనూ గమనించాలి. పెట్టుబడి ఎలా తిరిగి వస్తుందన్న దానిపై దృష్టి ఉండాలి’ అని తెలిపారు.
వడ్డీ రేట్ల పెంపు ఆగాలి: ‘వడ్డీ రేట్ల పెంపునకు విరామం కావాలి. ప్రస్తుతం దేశంలో సహేతుక వడ్డీ రేట్లు ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తు పెంపుపై ఆర్బీఐ తగిన విధంగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నట్లు’ బజాజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో.. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం డిప్యూటీ ఛైర్మన్, వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కమల్ బాలి, బ్లూమ్బర్గ్ ఎన్ఈఎఫ్ కమోడిటీస్, ఎనర్జీ గ్లోబల్ హెడ్ ఆశిశ్ సేథియా ప్రసంగించారు.
మరిన్ని ఆవిష్కరణలు రావాలి
‘మన దేశమే అతి పెద్ద మార్కెట్. ఇక్కడి ఆవిష్కరణలు మన ప్రజల అవసరాలను తీర్చగలిగితే అవి పెద్ద విజయం సాధించినట్లే. ఈ దిశగా సంస్థలు పోటీ పడాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో మన ఉత్పత్తులు రావాలి. ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధ వంటి సాంకేతికతలు కీలకం అవుతున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే అంశాన్ని చేతల్లో చూపించాలి. ప్రతి రంగంలో, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలి.’
సుచిత్ర ఎల్ల, సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్పర్సన్,
భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్గా కమల్ బాలి
సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం కొత్త ఛైర్మన్గా వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి ఎంపికయ్యారు. 2023-24 ఏడాదికి ఈయన ఛైర్మన్గా కొనసాగుతారు. ఇప్పటి వరకూ ఈ విభాగానికి ఆయన డిప్యూటీ ఛైర్మన్గా ఉన్నారు. 2017-18లో సీఐఐ కర్ణాటకకు ఛైర్మన్గా పనిచేశారు.
డిప్యూటీ ఛైర్పర్సన్గా చంద్ర టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ నందిని ఎంపికయ్యారు. 2010-11లో సీఐఐ తమిళనాడు విభాగానికి ఛైర్పర్సన్గా ఆమె పనిచేశారు. సీఐఐ ఇండియన్ వుమెన్ నెట్వర్క్కూ ఛైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
Samsung Power Banks: 10,000mAh, 20,000mAh సామర్థ్యంతో భారత్లో శామ్సంగ్ రెండు కొత్త పవర్బ్యాంకులను విడుదల చేసింది. -
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
పేటీఎం యూపీఐ లావాదేవీల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. వరుసగా మూడో నెలా క్షీణత నమోదైంది. మరోవైపు ఫోన్పే, గూగుల్ పే హవా కొనసాగుతోంది. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
Trading hours: స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ సమయం పొడిగించే అంశాన్ని సెబీ తిరస్కరించింది. -
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
Tesla: టెక్ కంపెనీల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసిన తమను తొలగించడంపై పలువురు సామాజిక మాధ్యమ వేదికల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,484 దగ్గర కొనసాగుతోంది. -
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం
తాజా వార్తలు (Latest News)
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ