సంక్షిప్త వార్తలు (7)
డిజిటల్ ఇంజినీరింగ్ సేవలు అందించే హైదరాబాద్ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా శ్రీనివాస్ కందుల నియమితులయ్యారు.
సిగ్నిటీ ఈడీగా శ్రీనివాస్ కందుల
ఈనాడు, హైదరాబాద్: డిజిటల్ ఇంజినీరింగ్ సేవలు అందించే హైదరాబాద్ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా శ్రీనివాస్ కందుల నియమితులయ్యారు. గతంలో ఈయన క్యాప్జెమినీ ఇండియా ఛైర్మన్, సీఈఓగా; ఐగేట్ మానవ వనరుల అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. శ్రీనివాస్ కందులకున్న విశేష అనుభవం సిగ్నిటీ టెక్నాలజీస్ భవిష్యత్ వృద్ధికి ఎంతో తోడ్పడనుందని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.
* భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా కేఆర్ఎం రావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన గెయిల్ (సీఅండ్పీ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు.
మెడిసిన్స్ పేటెంట్ పూల్తో అరబిందో ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్)ని నిరోధించే ఔషధం కాబొటెగ్రావిర్ మాత్రలు, సూదిమందును అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు మెడిసిన్స్ పేటెంట్ పూల్తో అరబిందో ఫార్మా సబ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైజర్, గ్లాక్సోస్మిత్క్లైన్ సంయుక్త సంస్థ అయిన వివ్ హెల్త్కేర్, కాబొటెగ్రావిర్ను అభివృద్ధి చేసి, ఐక్యరాజ్య సమితి మద్దతు ఉన్న మెడిసిన్ పేటెంట్ పూల్కు లైసెన్సు ఇచ్చింది. తక్కువ ధరలో ఈ ఔషధాన్ని తయారు చేసే సంస్థలకు ఇక్కడ నుంచి సబ్ లైసెన్సు లభిస్తుంది. అరబిందో ఫార్మా ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసి, భారత్తోపాటు 90 స్వల్ప, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేస్తుంది. అరబిందో ఫార్మా నెల్లూరు జిల్లా నాయుడుపేట, విశాఖలోని యుజియా ఫార్మా స్పెషాలిటీస్ కేంద్రాల్లో ఈ ఔషధాన్ని తయారు చేయనుంది.
బీడీఎల్కు రూ.8,161 కోట్ల ఆర్డర్లు
ఈనాడు, హైదరాబాద్: భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ ఆయుధ వ్యవస్థ (వెపన్ సిస్టం)ను భారత సైన్యానికి అందించేందుకు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆర్డరు లభించింది. భారత సైన్యంలోని రెండు రెజిమెంట్లకు ఈ వ్యవస్థను బీడీఎల్ అందించనుంది. ఈ ఆర్డర్ విలువ రూ.8,161 కోట్లు. మూడేళ్లలో ఈ ఆర్డరును పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎంఎల్హెచ్ హెలికాప్టర్లకు సీఎండీఎస్ సరఫరాకు సంబంధించిన రూ.261 కోట్ల ఆర్డరూ లభించిందని బీడీఎల్ తెలిపింది. ఈ కొత్త ఆర్డర్లతో సంస్థ ఆర్డర్ బుక్ మొత్తంగా రూ.24,021 కోట్లకు చేరిందని బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ్ మిశ్రా పేర్కొన్నారు.
స్తబ్దుగా మౌలిక రంగం
దిల్లీ: ఫిబ్రవరిలో 8 కీలక రంగాల వృద్ధి స్తబ్దుగా నమోదైంది. 2022 ఫిబ్రవరిలో 5.9 శాతంగా మౌలిక వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 6 శాతంగా నమోదైంది. ముడిచమురు మినహా అన్ని రంగాలు వృద్ధిని సాధించాయి. ఈ ఏడాది జనవరిలో కీలక రంగాల వృద్ధి 8.9 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరిలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ రంగాల వృద్ధి రేటు 7.89 శాతంగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో ఈ 8 కీలక రంగాల వృద్ధి 11.1 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ప్రధాన రంగాల వాటా 40.27 శాతం ఉంటుంది.
చిన్న కంపెనీలకు నేటి నుంచి కొత్త రుణ హామీ పథకం
దిల్లీ: దేశంలోని సూక్ష్మ, చిన్న స్థాయి కంపెనీలకు సవరించిన రుణ హామీ పథకం (క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్) ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానుంది. ఇందులో రూ.1 కోటి వరకు ఇచ్చే రుణాలకు వార్షిక ఫీజును 2 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గించారు. దీని వల్ల చిన్న వ్యాపారులకు మొత్తం మీద రుణ వ్యయాలు తగ్గనున్నాయి. రుణ హామీల పరిమితిని సైతం రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచుతూ క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎమ్ఎస్ఈ) మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.10 లక్షల వరకు అవుట్స్టాండింగ్ రుణాల హామీ విషయంలో క్లెయిముల సెటిల్మెంట్కు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దీపావళికి ఓయో ఐపీఓ
దిల్లీ: ఓయో బ్రాండ్పై ఆతిథ్య సేవలను అందిస్తున్న ఒరావెల్ స్టేస్, పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలను ప్రీ-ఫిల్లింగ్ పద్ధతిలో శుక్రవారం సెబీకి సమర్పించిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దీపావళి సమయంలో ఓయో తన పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)ను తీసుకురావొచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. సంప్రదాయ మార్గంలో అయితే సెబీ అనుమతి పొందిన 12 నెలల్లోగా కంపెనీలు ఐపీఓకు వస్తుంటాయి. అదే ప్రీ-ఫిల్లింగ్ మార్గంలో అయితే సెబీ తుది పరిశీలన అనంతరం 18 నెలల్లోగా రావొచ్చు. అదే సమయంలో సవరించిన ముసాయిదా పత్రాల(యూడీఆర్హెచ్పీ) దశ ముందు వరకు ఇష్యూ పరిమాణాన్ని 50 శాతం వరకు సవరించుకునే అవకాశం ఉంటుంది. కాగా, మార్కెట్ పరిస్థితులను బట్టి 400-600 మిలియన్ డాలర్ల (రూ.3300 - 5000 కోట్ల) మధ్య సమీకరణకు కంపెనీ ముందుకు రావొచ్చని అంచనా.
మిత్రా ఎనర్జీ నుంచి రూ.10,150 కోట్ల ఎస్పీవీల కొనుగోలు: జేఎస్డబ్ల్యూ ఎనర్జీ
దిల్లీ: జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ 15 స్పెషల్ పర్పస్ వెహికిల్స్, 13 అనుబంధ స్పెషల్ పర్పస్ వెహికిల్స్ను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.10,150 కోట్లని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. ఇవి మొత్తం 1.44 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది. ఈ స్పెషల్ పర్పస్ వాహనాలు ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య భారతంలో పనిచేస్తాయని కంపెనీ వివరించింది. 2024-25 నాటికి 10 గిగావాట్ల సామర్థ్యం లక్ష్యం దిశగా ముందుకు సాగడంలో ఈ కొనుగోలు దోహదం చేస్తుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?