3 రోజుల వరుస లాభాలకు విరామం
సూచీల మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.
సమీక్ష
సూచీల మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 32 పైసలు పుంజుకుని 83.29 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 86.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 72,396.97 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 72,363.03 వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 361.64 పాయింట్లు కోల్పోయి 72,470.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.05 పాయింట్లు తగ్గి 22,004.70 దగ్గర స్థిరపడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 20 నష్టపోయాయి. పవర్గ్రిడ్ 2.07%, భారతీ ఎయిర్టెల్ 1.60%, విప్రో 1.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.11%, కోటక్ బ్యాంక్ 1.11%, ఇన్ఫోసిస్ 1.09%, ఏషియన్ పెయింట్స్ 1.01%, టీసీఎస్ 0.92%, టెక్ మహీంద్రా 0.90% డీలాపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ 2.18%, ఎల్ అండ్ టీ 1.38%, ఎన్టీపీసీ 1.31%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.69% వరకు లాభపడ్డాయి. నీ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ కెనడాకు 90.8 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.755 కోట్ల) బకాయిలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విమానయాన సంస్థ స్పైస్జెట్ తెలిపింది. 2011లో 15 విమానాలు కొనుగోలు చేసేందుకు కంపెనీ ఈ రుణం తీసుకుంది.
- భారతీ హెగ్జాకామ్ ఐపీఓ ఏప్రిల్ 3న ప్రారంభమై 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.542- 570 నిర్ణయించారు.
- గుజరాత్లోని గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సీ బ్యాంకింగ్ యూనిట్లో ఎన్ఆర్ఐ ఖాతాదారుల కోసం డిజిటల్ అమెరికా డాలర్ ఫిక్స్డ్ డిపాజిట్ను తీసుకొచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇది నిర్వహించుకోవచ్చని వివరించింది.
- బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఔషధ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మాలో 2.9% వాటాను రూ.2,469 కోట్లకు క్రిస్క్యాపిటల్ విక్రయించింది. క్రిస్క్యాపిటల్కు చెందిన బీజే లిమిటెడ్, 1.16 కోట్ల మ్యాన్కైండ్ షేర్లను రెండు విడతల్లో అమ్మింది.
- 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు రూ.178 కోట్ల జీఎస్టీ చెల్లించాల్సిందిగా డిమాండ్ నోటీసు అందుకున్నట్లు ఎల్ఐసీ వెల్లడించింది.
- ల్యాంకో అమర్కంటక్ పవర్ను కొనుగోలు చేయాలన్న అదానీ పవర్ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంగళవారం ఆమోదం తెలిపింది. ల్యాంకో అమర్కంటక్ పవర్లో 100% షేర్ క్యాపిటల్, నియంత్రణను దక్కించుకోవాలని అదానీ పవర్ చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.