ఆనంద్ మహీంద్రా వితరణ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబం ప్రకటించింది.
మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు
దిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబం ప్రకటించింది. ఈ నిధులతో మహీంద్రా యూనివర్సిటీలో వచ్చే అయిదేళ్లలో కొత్త విభాగాల్లో కోర్సులు ప్రారంభిస్తారు. మహీంద్రా యూనివర్సిటీని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తారు. ఇదే కాకుండా ఆనంద్ మహీంద్రా తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్’కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆనంద్ మహీంద్రా వ్యక్తిగత హోదాలో రూ.50 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ స్కూల్ను విద్యా రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.
2020లో ఏర్పాటు: మహీంద్రా యూనివర్సిటీ 2020 మే లో హైదరాబాద్ శివార్లలోని బహదూర్పల్లిలో ఏర్పాటైంది. టెక్ మహీంద్రా మాజీ వైస్ఛైర్మన్ వినీత్ నయ్యర్ దీనికి ఆద్యులు. ఈ యూనివర్సిటీ ప్రస్తుతం అయిదు స్కూళ్లలో 35 రకాల కోర్సులు అందిస్తోంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ కోర్సులు ఉన్నాయి. దాదాపు 4,100 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో వివిధ ప్రోగ్రాముల్లో ఉన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మహీంద్రా యూనివర్సిటీకి పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి. కార్నెల్ ఎస్సీ జాన్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్- వర్జీనియా టెక్, బాబ్సన్ కాలేజ్- యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, లా ట్రోబ్ యూనివర్సిటీ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇంకా మరికొన్ని సంస్థలతో కరిక్యులమ్ బిల్డింగ్, స్టూడెంట్/ ఫ్యాకల్టీ మార్పిడి ప్రోగ్రామ్లు, పరిశోధనా భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.