Elon Musk: జుకర్బర్గ్ ఇంటికెళ్తా.. ఆయన ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్: మస్క్ ట్వీట్
కేజ్ ఫైట్ కోసం తన టెస్లా (Tesla) కారును జుకర్బర్గ్ (Mark Zukerberg) ఇంటికి డ్రైవ్ చేయాలని అడుగుతానని, ఆయన ఇంట్లో ఉంటే అక్కడే ఫైట్ చేస్తానని ఎలాన్ మస్క్ (Elon Musk) ట్వీట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్బర్గ్ (Mark Zukerberg) మధ్య కేజ్ ఫైట్ (Cage Fight)పై కొంత కాలంగా ఆన్లైన్లో మాటల యుద్ధం జరుగుతోంది. ఫైట్ కోసం మస్క్ డేట్లు ఇవ్వడంలేదని ఆదివారం జుకర్బర్గ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేజ్ ఫైట్ గురించి మస్క్ మరోసారి ట్వీట్ చేశారు. తన టెస్లా కారును (ఆటోపైలట్) జుకర్బర్గ్ ఇంటికి డ్రైవ్ చేయాలని అడుగుతానని.. మెటా సీఈవో ఇంట్లో ఉంటే అక్కడే ఫైట్ చేస్తానని ట్వీట్ చేశారు.
‘‘ఈ రోజు రాత్రి నా టెస్లా కారును పాలో ఆల్టోలోని జుకర్బర్గ్ ఇంటికి తీసుకెళ్లమని చెప్తాను. అలాగే ఎక్స్లో లైవ్ స్ట్రీమింగ్ను కూడా పరీక్షిస్తాం. జుకర్బర్గ్ నా కోసం తలుపు తీస్తే, మీరు మా ఫైట్ను చూడొచ్చు’’ అని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, జుకర్బర్గ్ ఇంట్లో ఉండడని, ఆయన షెడ్యూల్ ప్రకారం వేరే చోటికి ప్రయాణమైనట్లు మెటా అధికార ప్రతినిధి తెలిపారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘‘ఈ రోజు నేను ట్వీట్ చేసిన తర్వాత జుకర్బర్గ్ ఇంట్లో హడావుడిగా బ్యాగ్లు ప్యాక్ చేశారు. ఎక్కడికో ప్రయాణమైనట్లున్నాడు’’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
మస్క్ లైట్ తీసుకున్నాడు..: జుకర్ బర్గ్ అసహనం
అంతకముందు కేజ్ ఫైట్ గురించి మస్క్ సీరియస్గా లేడని, ఇకపై ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మేలని జుకర్బర్గ్ థ్రెడ్స్లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ గురించి ఓ నెటిజన్ మస్క్ దృష్టికి తీసుకెళ్లగా సోమవారం ఆయన ఇంటికి వెళతానని ట్వీట్ చేశాడు. గత కొంత కాలంగా ఈ పోరు గురించి టెక్ దిగ్గజాలు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం తమ మధ్య కేజ్ ఫైట్ను ఎక్స్లో లైవ్ స్ట్రీమ్ అవుతుందని మస్క్ ట్వీట్ చేశాడు. అయితే, ఇది ఎప్పుడు జరుగుతుందనే దానిపై మాత్రం ఇరువురు స్పష్టతనివ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం