Adani Group: ‘అదానీ’లో జీక్యూజీ పెట్టుబడి.. ఇప్పటికే 60% లాభం!
Adani Group: హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు పతనమైన విషయం తెలిసిందే. సరిగ్గా ఆ సమయంలో జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేసింది.
దిల్లీ: జీక్యూజీ పార్ట్నర్స్ (GQG Partners).. ఇది అమెరికాకు చెందిన ఓ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆ సమయంలోనే అదానీ షేర్లను జీక్యూజీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ పెట్టుబడులు మంచి ప్రతిఫలం ఇస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
కష్టకాలంలో ఈక్విటీ వాటాలు కొనుగోలు చేసి ‘అదానీ’కి జీక్యూజీ పార్ట్నర్స్ (GQG Partners) ఒకరకంగా అండగా నిలిచింది. అలా సమీకరించిన నిధులను అప్పులు చెల్లించడానికి అదానీ గ్రూప్ (Adani Group) వినియోగించుకుంది. దీంతో ఇన్వెస్టర్లలో ఈ కంపెనీల స్టాక్స్పై విశ్వాసం పెరిగింది. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ షేర్ల ర్యాలీకి దోహదం చేసిన విషయం తెలిసిందే. దీంతో జీక్యూజీ (GQG Partners) పెట్టిన పెట్టుబడులు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి.
ఫిబ్రవరి 24న హిండెన్బర్గ్ నివేదిక వెలువడింది. అప్పటి నుంచి అదానీ స్టాక్స్ (Adani Group stocks) పతనం ప్రారంభమైంది. మార్చి 2న అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల షేర్లను జీక్యూజీ (GQG Partners) కొనుగోలు చేసింది. దాదాపు రూ.15,444 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రాజీవ్ జైన్ వెల్లడించారు. అప్పటి నుంచి స్టాక్స్ పెరిగిన తీరును బట్టి చూస్తే ఇప్పటి వరకు దాదాపు 60 శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జీక్యూజీ పెట్టుబడి దాదాపు రూ.24 వేల కోట్లు దాటింది! అయితే, ఏయే కంపెనీలో ఎంత మేర పెట్టుబడిగా పెట్టారు? అవి ఎంత మేర వృద్ధి చెందాయనేది మాత్రం స్పష్టంగా తెలియదు.
అదానీ గ్రూప్ (Adani Group)లో తమ వాటాను మరింత పెంచుకుంటున్నట్లు జీక్యూజీ (GQG Partners) మంగళవారం ప్రకటించింది. భారత్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న అదానీ గ్రూప్ రానున్న రోజుల్లో మదుపర్లకు మంచి ప్రతిఫలాలను అందిస్తుందని రాజీవ్ జైన్ ఓ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అదానీ గ్రూప్లో తమ వాటాను మరింత పెంచుకుంటామని వెల్లడించారు.
(గమనిక: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న అంశం. ఏ స్టాక్లో పెట్టుబడి పెట్టాలనేది పూర్తిగా ఇన్వెస్టర్ల వ్యక్తిగత వ్యవహారం. ఒక స్టాక్ను కొనుగోలు చేయాలనిగానీ, విక్రయించాలనిగానీ ఈనాడు.నెట్ సూచించడం లేదు.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం