Hero MotoCorp: అదరగొట్టిన హీరో మోటోకార్ప్.. నికర లాభం ₹811 కోట్లు
Hero MotoCorp and TVS Q4 Results: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు హీరో మోటోకార్ప్, టీవీఎస్ కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. రెండు సంస్థలూ ఫలితాల్లో అదరగొట్టాయి.
దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 2022-23 చివరి త్రైమాసికంలో (Q4 results) అంచనాలను మించి రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన పన్ను అనంతరం రూ.811 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో రూ.621 కోట్లతో పోలిస్తే ఇది 31 శాతం అధికం. మొత్తం ఆదాయం సైతం రూ.7,628 కోట్ల నుంచి రూ.8672 కోట్లకు పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
- జనవరి-మార్చి త్రైమాసికంలో 12.70 లక్షల యూనిట్లను హీరో విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 11.89 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 7 శాతం మేర పెరిగాయి. మొత్తం ఏడాదిలో విక్రయాలు 49.44 లక్షల యూనిట్ల నుంచి 53.29 లక్షలకు పెరిగాయి.
- మొత్తం ఏడాదికి గానూ కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.2,329 కోట్ల నుంచి రూ.2800 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం సైతం రూ.30,106 కోట్ల నుంచి రూ.34,727 కోట్లకు పెరిగింది.
- 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2 ముఖ విలువ ఒక్కో షేరుకు రూ.35 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు హీరో మోటోకార్ప్ బోర్డు ఆమోదం తెలిపింది.
సీఈవో మాట
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వివిధ సెగ్మెంట్లలో కొత్త ప్రొడక్ట్లను లాంచ్ చేయనున్నామని హీరో మోటోకార్ప్ సీఈఓ రంజన్ గుప్తా తెలిపారు. ప్రీమియం పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేయడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న మోడళ్ల ప్రీమియమైజ్ చేయాలనుకుంటున్నామని తెలిపారు. విడా విద్యుత్ స్కూటర్ల కోసం ఇప్పటికే ఉన్న తమ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వినియోగించుకోనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ద్విచక్ర వాహన పరిశ్రమ ఆదాయం రెండింతల వృద్ధి సాధించనుందని అంచనా వేశారు.
- ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో హీరో మోటోకార్ప్ షేరు 0.43 శాతం లాభంతో రూ.2,514.05 వద్ద ముగిసింది.
టీవీఎస్ లాభం 21 శాతం జంప్
మార్చితో ముగిసిన త్రైమాసికంలో (Q4 results) టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ ఏకీకృత నికర లాభం 21 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.277 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.336 కోట్లకు పెరిగింది. పెరిగిన వాహన విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. కార్యకలాపాల ఆదాయం రూ.6,585 కోట్ల నుంచి రూ.8031 కోట్లకు పెరిగినట్లు టీవీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
జనవరి- మార్చి త్రైమాసికంలో మొత్తం 8.68 లక్షల యూనిట్లను టీవీఎస్ విక్రయించింది. మొత్తం ఏడాదికి గానూ రూ.1329 కోట్ల నికర లాభాన్ని, రూ.31,974 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. సంవత్సరం మొత్తానికి గానూ 11 శాతం వృద్ధితో 36.82 లక్షల యూనిట్లు (ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు) విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు 1.12 శాతం లాభపడి రూ.1169.85 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM