Hyundai IPO: దీపావళికి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ?
Hyundai IPO: హ్యుందాయ్ మోటార్ ఇండియా విలువను ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు 22-28 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. దీంట్లో 15-20 శాతం వాటాను ఐపీఓలో విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ముంబయి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ తమ భారత అనుబంధ కంపెనీని ఐపీఓకి (IPO) తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ఎకనామిక్ టైమ్స్’ వెల్లడించింది. దీపావళి వరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (Hyundai Motor India Limited- HMIL) పబ్లిక్ ఇష్యూకు రావొచ్చని తెలిపింది.
హ్యుందాయ్ భారత్లోకి ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలు గడిచింది. గత ఏడాది దేశంలో రెండో అతిపెద్ద ప్రయాణికుల వాహన విక్రయ సంస్థగా (HMIL) నిలిచింది. గోల్డ్మన్ శాక్స్, సిటీ, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, డాయిషే బ్యాంక్, యూబీఎస్ వంటి బడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఐపీఓ అవకాశాలను గతవారం కంపెనీకి వివరించినట్లు సమాచారం. హెచ్ఎంఐఎల్ విలువను ఈ సంస్థలు 22-28 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. దీంట్లో 15-20 శాతం వాటాను ఐపీఓలో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ.27,500- 46,500 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అదే జరిగితే భారత్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ (IPO) ఇదే అవుతుంది. ఇప్పటి వరకు రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్ఐసీ ఐపీఓనే పెద్దది.
హ్యుందాయ్ (Hyundai) 1996లో భారత్లోకి ప్రవేశించింది. ప్రపంచంలో ఈ కంపెనీకి భారత్ మూడో అతిపెద్ద మార్కెట్. క్రెటా, ఎక్స్టర్, వెర్నా, ఐ20, గ్రాండ్ ఐ10, నియోస్, టక్సన్, అల్కజార్ వంటి ప్రముఖ కార్లను విక్రయిస్తోంది. 2023లో దేశీయంగా 6.02 లక్షల వాహనాలను విక్రయించింది. 1.63 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. 2022-23లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.59,781 కోట్లకు చేరింది. EBITDA ఆదాయం 14.33 శాతం పుంజుకుంది. నికర లాభాలు 62 శాతం పెరిగి రూ.4,653 కోట్లకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్