India - France: మోదీ - మెక్రాన్ల భేటీ.. ఏవియేషన్ రంగంలో కీలక ఒప్పందాలు
ఫ్రాన్స్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలకు చెందిన సంస్థల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
దిల్లీ: ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వైమానిక రంగంలో పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వత్రా తెలిపారు. ఇది రక్షణ రంగంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకుసాగేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం, అంతరిక్ష, సైబర్స్పేస్, కృత్రిమమేధ, రోబోటిక్స్, స్వయం చోదిత వాహనాలు వంటి రంగాల్లో సహాయసహకారాలు అందజేసుకోనున్నాయి.
‘థాంక్యూ ఇండియా’.. వీడియో షేర్ చేసిన మెక్రాన్
గురువారం జైపుర్లో మెక్రాన్తో ప్రధాని మోదీ (PM Modi) ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా టాటా-ఎయిర్బస్ సంస్థలు హెలికాఫ్టర్ తయారీకి ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు కలిసి హెచ్125 హెలికాఫ్టర్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఇప్పటికే వీటి భాగస్వామ్యంలో గుజరాత్లోని ప్లాంట్లో సీ-295 రవాణా విమానాల తయారీ జరుగుతోంది. నింగిలోకి ఉపగ్రహాలను పంపేందుకు న్యూ స్పేస్ ఇండియా-ఏరియన్ స్పేస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని వినయ్ క్వత్రా తెలిపారు. గాజాలో తాజా పరిస్థితులు, ఉగ్రవాదం, ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించినట్లు వెల్లడించారు. దేశీయంగా విమాన ఇంజిన్ల తయారీకి సంబంధించి భారత్కు వంద శాతం పూర్తి సహాయసహకారాలు అందించేందుకు శాఫ్రాన్ సంస్థ సుముఖంగా ఉందని భారత్లోని ఫ్రాన్స్ రాయబారి జావేద్ అష్రఫ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.