Financial incentives: ల్యాప్టాప్, ట్యాబ్లెట్ తయారీ కంపెనీలకు భారీ ప్రోత్సాహకాలు?
భారత్లో ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు తయారు చేసే కంపెనీలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం....
దిల్లీ: తయారీలో చైనాను అధిగమించేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. మేకిన్ ఇండియా, పీఎల్ఐ.. వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. తాజాగా ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు తయారు చేసే కంపెనీలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యాపిల్, డెల్ వంటి బడా సంస్థల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపినట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది.
దీనికి సంబంధించిన విధానాన్ని ఇప్పటికే అభిప్రాయ సేకరణ కోసం ఆయా పరిశ్రమల ప్రతినిధులకు పంపినట్లు సదరు వ్యక్తి తెలిపారు. ఒక్కో కంపెనీకి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్ల తయారీని పెంచి దిగుమతులను తగ్గించుకోవాలని భారత్ యోచిస్తోంది. అలాగే దీర్ఘకాలంలో వీటి ఎగుమతిలో దేశాన్ని అగ్రభాగాన నిలపాలని ప్రణాళికలు రచిస్తోంది.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో ఉన్న యాపిల్, డెల్, హెచ్పీ, ఆసుస్టెక్ కంప్యూటర్ వంటి దిగ్గజ కంపనీలను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కంపెనీలు దేశీయంగా తయారీని ప్రారంభించేలా ప్రోత్సహించాలని చూస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే స్థానికంగా ఐఫోన్ల తయారీని చేపట్టిన యాపిల్ ఇక్కడే ఐప్యాడ్లను కూడా ఉత్పత్తి చేసేలా చేయాలన్నది ప్రభుత్వ యోచన అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి తెలిపారు.
ప్రభుత్వం ఇవ్వబోయే ఈ ప్రోత్సాహకాలకు విదేశీ కంపెనీలు ఎంపిక కావడానికి ప్రభుత్వం కొన్ని షరతులు కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్ల పాటు కనీసం 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన కంపెనీలను ఎంపిక చేయొచ్చని సమాచారం. అలాగే ఆయా కంపెనీలు స్థానిక విడిభాగాల కొనుగోలుపై ప్రోత్సాహకాల మొత్తం ఆధారపడి ఉంటుందని సమాచారం. పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత ఈ విధానంలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. గత ఏడాదే ప్రభుత్వం ల్యాప్టాప్, ట్యాబ్లెట్లు, పీసీల తయారీ పరిశ్రమ కోసం రూ.73,500 కోట్ల ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించింది. కానీ, ప్రోత్సాహకాల పరిమాణం తక్కువ ఉండడంతో కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ