World bank: భారత వృద్ధి 6.3%.. ప్రపంచబ్యాంక్ వెల్లడి.. ద్రవ్యోల్బణ అంచనాలు పెంపు
World bank on Indian Economy: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.3 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. వృద్ధి అంచనాలను స్థిరంగా ఉంచింది.
దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి (Indian Economy) అంచనాలను ప్రపంచబ్యాంక్ (World bank) వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) 6.3 శాతం వృద్ధిని నమోదు కావొచ్చని పేర్కొంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, దేశీయ డిమాండ్ ఇందుకు కారణమని పేర్కొంది. అదే సమయంలో ద్రవ్యోల్బణ అంచనాలను మాత్రం సవరించి 5.9 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచబ్యాంక్ ఓ నివేదికను విడుదల చేసింది.
ప్రపంచ భౌగోళిక సవాళ్లు ఎదురవుతున్నా భారత్ వృద్ధిని నమోదు చేయగలదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. స్వల్పకాలంలో కొన్ని సవాళ్లు ఎదురైనా.. కొనుగోళ్లు, ప్రైవేటు పెట్టుబడులతో భారత్కు అనుకూల వాతావరణం నెలకొందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. తదుపరి రెండేళ్ల పాటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 6.4 శాతం, 6.5 శాతం చొప్పున నమోదు కావొచ్చని పేర్కొంది. ఒకవైపు అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ.. జీ20 దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కంటే రెట్టింపు వృద్ధితో దూసుకెళ్తుతోందని తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఏప్రిల్ నెల సమీక్షలో భారత వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంక్ తగ్గించింది. 6.6 శాతంగా ఉన్న అంచనాలను 6.3 శాతానికి కుదించింది.
గూగుల్ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల
ఓ వైపు వృద్ధి అంచనాలను స్థిరంగా ఉంచిన ప్రపంచబ్యాంక్, ద్రవ్యోల్బణ అంచనాలను మాత్రం పెంచింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వ చర్యల కారణంగా వస్తువుల సరఫరా మెరుగుపడుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఏప్రిల్లో 5.2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ అంచనాలను తాజాగా 5.9 శాతానికి పెంచింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా జులైలోలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయని, ఆగస్టులో తగ్గినప్పటికీ.. మిగిలిన నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల ఆందోళనకరం కానుందని పేర్కొంది. వచ్చే ఏడాదికి 4.7 శాతం, ఆ మరుసటి ఆర్థిక సంవత్సరంలో 4.1 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు కావొచ్చని ప్రపంచబ్యాంక్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Elon Musk: మస్క్ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) చిన్నతనంలో భయానక అనుభవాలు ఎదుర్కొన్నారట. అవి ఇప్పటికీ ఆయనపై ప్రభావం చూపుతున్నాయట. -
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
Windows 10 update: విండోస్ 10 వాడుతున్న వారు విండోస్ 11కు అప్గ్రేడ్ అవ్వాలి. లేదంటే భవిష్యత్లో సెక్యూరిటీ అప్డేట్స్కు డబ్బులు చెల్లించాలి. -
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!
Redmi: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్మీ తన సి సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లను మూడు వేరియంట్లలో తీసుకొచ్చినట్లు పేర్కొంది. -
Stock Market: మూడోరోజూ రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 20,900 పైన ముగిసిన నిఫ్టీ
Stock Market Closing bell: సెన్సెక్స్ 357.59 పాయింట్లు లాభపడి 69,653.73 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 82.60 పాయింట్లు పెరిగి 20,937.70 వద్ద ముగిసింది. -
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్లో 28.54 లక్షల అమ్మకాలు
Automobile Sales: దీపావళి, కొత్త మోడళ్ల విడుదల, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం వంటి కారణాలతో నవంబర్లో వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. -
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్
New Sim card rule: సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇకపై పేపర్ విధానం కనుమరుగు కానుంది. -
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
Instagram: ఫేస్బుక్, ఇన్స్టా మధ్య అనుసంధానానికి వీలు కల్పించిన క్రాస్ చాటింగ్ ఫీచర్ను తొలగించనున్నట్లు మెటా వెల్లడించింది. -
OnePlus 12: స్నాప్డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్తో వన్ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?
OnePlus 12: వన్ప్లస్ 12 ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల కానుంది. -
Nirmala Sitharaman: వరుసగా ఐదోసారి.. ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో నిర్మలా సీతారామన్
ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వరుసగా ఐదో సారి చోటు లభించింది. -
ZestMoney: బీఎన్పీఎల్ స్టార్టప్ జెస్ట్మనీ మూత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
ZestMoney: జెస్ట్మనీ కొనుగోలు ప్రతిపాదనను ఫోన్పే విరమించుకోవడంతో కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాజీనామా చేశారు. అప్పటి నుంచి సంస్థలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. -
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 217 పాయింట్లు పెరిగి 69,513 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 20,936 వద్ద ట్రేడవుతోంది. -
Rapido: క్యాబ్ సేవల విభాగంలోకి ర్యాపిడో
రైడ్ సేవలు అందించే ర్యాపిడో, క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీపడనుంది. -
Gold: తనఖా బంగారం పోతే బ్యాంకుదే బాధ్యత
ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం. -
టెక్ ప్రపంచానికి హైదరాబాదీ ఉత్పత్తులు
ఇంటర్నెట్ కూడా సరిగా లేని రోజుల్లో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్, మనదేశంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా సాహసమే. అప్పటికి, వేరే ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తి ప్రక్రియను అమెరికాలోని ప్రధాన కార్యాలయంతో ఎలా అనుసంధానించాలనే విషయంపైనా స్పష్టత లేదు. -
ఈడీ చర్యలతో ప్రభుత్వ బ్యాంకులకు రూ.15,183 కోట్లు వెనక్కి
మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రూ.15,186.64 కోట్లలో దాదాపు అంతా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెనక్కి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. -
21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించాం
జీఎస్టీ అధికారులు రెండు నెలల పాటు (ఈ ఏడది మే 16 నుంచి జులై 15 వరకు) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించారని, రూ.24,000 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లుగా తేల్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
69,000 శిఖరంపై సెన్సెక్స్
వరుసగా ఆరో రోజూ లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ కొత్త గరిష్ఠాలకు చేరాయి. విద్యుత్, బ్యాంకింగ్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 69,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
2030కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023-24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
ఏఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ మళ్లీ ఎన్నిక
2023-24 ఏడాదికి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రై.లి. దక్షిణాసియా సీఈఓ ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. -
అదానీ గ్రూపు చేతికి సంఘీ ఇండస్ట్రీస్
సంఘీ ఇండస్ట్రీస్ను గౌతమ్ అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ స్వాధీనం చేసుకుంది. ఒక్కో షేరుకు రూ.121.90 చొప్పున చెల్లించి, ఈ లావాదేవీని పూర్తి చేసింది. -
వినియోగ బైక్ల వ్యాపారంలోకి రాయల్ ఎన్ఫీల్డ్
మోటార్సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా వినియోగ (ప్రీ-ఓన్డ్) బైక్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘రీఓన్’ పేరుతో ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది.


తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: మస్క్ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు
-
Hyderabad: రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం.. 7న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
KCR: కేసీఆర్కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు
-
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
-
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!
-
Manchu Manoj: అందుకు నన్ను క్షమించాలి: మంచు మనోజ్