stock market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు..

బుధవారం స్టాక్‌మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Updated : 09 Aug 2023 09:48 IST


ముంబయి :  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ(stock market)లు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ద్రవ్యపరపతి విధాన సమీక్ష, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు గురువారం వెలువడనుండటం, మరోవైపు అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9.26 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 162 పాయింట్లు నష్టపోయి 65,684 వద్ద.. నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు క్షీణించి 19,537 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.80 వద్ద ఉంది.

నిఫ్టీలో డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్‌, విప్రో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని