India Exports Imports: 2023లో భారత వస్తు సేవల ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి
India Exports Imports: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ ఘర్షణలు, ఎర్రసముద్రంలో హౌతీల దాడుల వల్ల గత ఏడాది వస్తువుల ఎగుమతులు దెబ్బతిన్నాయి.
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ.. 2023లో భారత వస్తు సేవల ఎగుమతుల (Indian Exports) విలువ 0.4 శాతం పెరిగి 765.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్, ఔషధ, పత్తి, వస్త్ర, సిరమిక్, మాంసం, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల ఎగుమతులు అందుకు దోహదం చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.
ఒక్క వస్తువుల ఎగమతులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది 4.71 శాతం తగ్గి 431.9 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి. సేవల ఎగమతులు (Imports) మాత్రం 7.88 శాతం పుంజుకొని 388.8 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో వస్తువుల దిగుమతులు సైతం ఏడు శాతం తగ్గి 667.73 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. భారత ఎగుమతులు ప్రధానంగా అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, యూకే, జర్మనీలకు చేరాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ ఘర్షణలు, ఎర్రసముద్రంలో హౌతీల దాడుల వల్ల గత ఏడాది సరకుల ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఒకవేళ ఇవి ఇలాగే కొనసాగితే ప్రపంచ వాణిజ్యంపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత ఎగుమతులు, దిగుమతుల విలువ 2023లో వార్షిక ప్రాతిపదికన 2.6 శాతం కుంగి 1,609 బిలియన్ డాలర్లకు చేరినట్లు ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI)’ ఇటీవల తెలిపింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా 141.3 బిలియన్ డాలర్ల నుంచి 75.2 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - డిసెంబర్ మధ్య వస్తువుల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 5.7 శాతం తగ్గి 317.12 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి. దిగుమతుల విలువ 7.93 శాతం కుంగి 505.15 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో తొలి మూడు త్రైమాసికాల్లో 188.02 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు