2023లో IPO మదుపర్లకు లాభాల పంట.. 59లో 55 కంపెనీల రాబడి 45%
IPOs: ఈ ఏడాదిలో మొత్తం 59 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. వీటిలో 55 కంపెనీల షేర్లు ఏడాది ముగిసే నాటికి 45 శాతానికి పైగా ప్రతిఫలాన్నివ్వడం విశేషం.
ముంబయి: ఈ ఏడాది మొత్తం మెయిన్బోర్డులో 59 కంపెనీలు ఐపీఓకి (IPO) వచ్చాయి. వీటిలో 55 సంస్థలు సగటున 45 శాతానికి పైగా రాబడినివ్వడం విశేషం. అదే సమయంలో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్ ప్రధాన సూచీలు 20 శాతం ర్యాలీ అయ్యాయి. 59 కంపెనీలు కలిపి రూ.54 వేల కోట్ల నిధులను సమీకరించాయి.
59 ఐపీఓల సగటు లిస్టింగ్ (IPO Listings) లాభం 26.3 శాతంగా ఉంది. అలాగే అవన్నీ కలిపితే డిసెంబర్ 29న మార్కెట్లు ముగిసే నాటికి 45 శాతం రాబడినిచ్చాయి. కేవలం నాలుగు మాత్రమే ఏడాది ముగిసే సరికి ఇష్యూ ధరతో పోలిస్తే దిగువన ట్రేడవుతున్నాయి. ఐపీఓకి వచ్చిన 59 కంపెనీల్లో 23 షేర్లు లిస్టింగ్ నుంచి ఇప్పటి వరకు 50 శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. తొమ్మిది కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 67 శాతానికి పైగా పుంజుకున్నాయి.
2023లో ఐపీఓకి (IPO) వచ్చిన కంపెనీల్లో ‘ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (IRDEA)’ మదుపర్లకు అన్నింటికంటే మెరుగైన ప్రతిఫలాన్ని ఇచ్చింది. నవంబరు 29న లిస్టయిన ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే 221.3 శాతం రాబడినిచ్చాయి. డిసెంబర్ 29న ఈ ఏడాది ట్రేడింగ్ ముగిసే నాటికి 204 శాతం లాభాన్నిచ్చాయి. తర్వాత సైయెంట్ డీఎల్ఎం ఇష్యూ ధర రూ.265తో పోలిస్తే 154.5 శాతం, నెట్వెబ్ టెక్నాలజీస్ రూ.500 ఇష్యూ ధర కంటే 140.7 శాతం పుంజుకున్నాయి.
లిస్టింగ్ రోజు అత్యధిక లాభాన్నిచ్చిన కంపెనీల జాబితాలో ఐఆర్డీఈఏ తర్వాత టాటా టెక్ నిలిచింది. రూ.500 ఇష్యూ ధరతో పోలిస్తే 136 శాతం రాబడినిచ్చింది. తర్వాత సిగ్నేచర్ గ్లోబల్ రూ.385 ఇష్యూ ధర కంటే 128 శాతం పుంజుకుంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల పరంగా చూస్తే 240 ఇష్యూలతో చైనా తొలిస్థానంలో ఉంది. మొత్తం 60 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. స్థూల ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండడం, రాజకీయ సుస్థిరత, ఆశావహ కార్పొరేట్ ఫలితాలు, వడ్డీరేట్ల కోత సంకేతాలు, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం స్టాక్ మార్కెట్లతో పాటు ఐపీఓల సెంటిమెంట్ను బలపర్చాయి. దాదాపు 2.7 కోట్ల కొత్త ఇన్వెస్టర్లు ఈసారి మార్కెట్లోకి ప్రవేశించడం గమనార్హం.
మరోవైపు 59 మెయిన్బోర్డ్ ఐపీఓలతో పాటు ఎస్ఎంఈ సెగ్మెంట్లో 182 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!