PAN Aadhaar Link: ఆధార్-పాన్ అనుసంధానానికి నేడే ఆఖరు.. లింక్ చేయకపోతే ఏమవుతుందంటే?
PAN Aadhaar Link: ఆధార్తో పాన్ను అనుసంధానం చేశారా? లింక్ చేయడానికి నేడు ఆఖరు తేదీ. లింక్ చేయకపోతే రేపటి నుంచి పాన్ నంబరు పనిచేయదు. మరి అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే..?
ఇంటర్నెట్ డెస్క్: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం దానికి ఆధార్ సంఖ్యను అనుసంధానం (PAN Aadhaar Link) చేయాల్సిందే. ఈ పాన్-ఆధార్ లింక్ గడువు నేటితో ముగియనుంది. జులై 1వ తేదీ నుంచి ఆధార్తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.
నిజానికి పాన్-ఆధార్ లింక్ (PAN Aadhaar Link)కు గడువు ఎప్పుడో ముగిసింది. అనంతరం రూ.1000 అపరాధ రుసుముతో తొలి మార్చి 31, ఆ తర్వాత జూన్ 30 వరకు అదనపు గడువు కల్పించారు. ఇప్పుడు ఆ సమయం కూడా నేటితో ముగుస్తోంది. అయితే, ఈ గడువును మరోసారి పెంచే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై ప్రభుత్వం మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు. ఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోవాలని చాలా కాలంగా ఆదాయపు పన్ను శాఖ చెబుతూ వస్తున్నా.. ఇంకా చాలా మంది భేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ రెండింటిని అనుసంధానం చేసినట్లయితే వారి ఆర్థిక లావాదేవీలు పూర్తిగా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందువల్లనే చాలా మంది పాన్ కార్డుదారులు ఆధార్తో అనుసంధానం చేసుకునేందుకు వెనుకాడుతున్నారు.
చెక్ చేసుకోండిలా..
అనుసంధానం చేశామా... లేదా అన్న అనుమానం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్లి తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో లింక్ ఆధార్ స్టేటస్పై క్లిక్ చేసి ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఇది వరకు అనుసంధానం చేసి ఉంటే.. చేసినట్లు సందేశం వస్తుంది. లేదంటే ఫైన్ చెల్లించి అనుసంధానం చేసుకునేందుకు అవకాశం ఇస్తూ ఆప్పన్లు కనిపిస్తాయి. ఆపరాధ రుసుం రెండు విధాలా చెల్లించొచ్చని...ఒకటి ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి కానీ, రెండోది ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా కానీ చెల్లించొచ్చు.
ఇదీ చదవండి: పాన్- ఆధార్ లింక్ చేయండిలా..
పాన్-ఆధార్ లింక్ లేకపోతే ఏమవుతుంది?
బ్యాంకింగ్ సేవలను పొందడం, డెబిట్, క్రెడిట్ కార్డులను వాడడం, ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ ఇలాంటి సేవలన్నీ ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే.. మీ పాన్ను ఆధార్ను తప్పనిసరిగా అనుసంధానం (PAN Aadhaar Link) చేయాలి. లేదంటే ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది.
- మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు.
- పనిచేయని పాన్తో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు.
- పెండింగ్ రిటర్నుల ప్రాసెస్ కూడా నిలిచిపోతుంది.
- పెండింగ్ రీఫండ్లను జారీ చేయరు.
ఎవరికి లింక్ అవసరం లేదంటే..?
అయితే కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు పాన్తో ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. 80 ఏళ్ల పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు (ఎన్నారైలు).. భారత పౌరులు కాని వ్యక్తులు, అస్సాం, మేఘాలయ, జమ్ము, కశ్మీర్లల్లో నివాసం ఉండే వారు దీన్ని లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్