PAN-Aadhaar: పాన్- ఆధార్ లింక్ చేశారా..? ఇలా చేసుకోండి..
How to link PAN Aadhaar Full details: ఆధార్తో పాన్ను అనుసంధానం చేశారా? చేశారో లేదో కూడా గుర్తు లేదా? అయితే తనిఖీ చేసుకోండి. అనుసంధానం చేయకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి.
ఇంటర్నెట్ డెస్క్: పాన్ కార్డు (Pan Card) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్తో (Aadhaar) అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానం పూర్తి చేయాలి. ఆధార్తో జత చేయని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి పాన్ చెల్లుబాటు కాదు. చెల్లుబాటులో లేని పాన్తో నిబంధనల మేరకు లావాదేవీలు చేయడం వీలు పడదు. ఒకవేళ మీరు ఆధార్తో పాన్ను అనుసంధానం చేశారో లేదో గుర్తు లేదా? ఒకవేళ చేయకుంటే ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలివీ..
అనుసంధానం అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
ఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ ఎప్పటి నుంచో చెబుతోంది. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరికి తాము అనుసంధానం చేసిందీ లేనిదీ గుర్తు లేదు. ఒకవేళ ఆ సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో ‘లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే ఆ సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్ చెల్లించి ఆధార్-పాన్ అనుసంధానం పూర్తి చేయాలి.
ఫైన్ ఎలా చెల్లించాలి..?
ఫైన్ చెల్లించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్, రెండోది ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్. తొలుత ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో ఫైన్ చెల్లించే విధానం తెలుసుకుందాం.
I.తొలి విధానం
- ముందు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి ఎంటర్ కావాలి. అందులో ‘ఈ-పే ట్యాక్స్’పై క్లిక్ చేయాలి.
- అక్కడ పాన్ నంబర్ను రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి. దిగువన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి.
- తర్వాతి పేజీలో మీ ఫోన్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
- వెరిఫికేషన్ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి. (ఒకవేళ మీ దగ్గర సంబంధిత బ్యాంకింగ్ ఆప్షన్స్ లేకపోతే రెండో పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.)
- తర్వాతి ప్రక్రియలో అసెస్మెంట్ ఇయర్ (Ay 2023-24)ను ఎంచుకకోవాలి. తర్వాత అదర్ రిసిప్ట్స్ (Other receipts (500) ఎంచుకోవాలి.
- ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్ గేట్వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.
- పేమెంట్ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లోని లింక్ ఆధార్ను క్లిక్ చేసి పాన్ను అనుసంధానం చేసుకోవచ్చు.
II.రెండో విధానం
- రెండో విధానంలో ఫైన్ చెల్లించేందుకు egov-nsdl.com అనే వెబ్సైట్కి వెళ్లాలి.
- తొలుత నాన్- టీడీఎస్/టీసీఎస్ చెల్లింపుల విభాగంలోకి వెళ్లాలి.
- అక్కడ Tax applicable - (0021) ఆప్షన్ను ఎంచుకోవాలి. తర్వాత (500) Other Receipts ఆప్షన్ ఎంచుకోవాలి.
- తర్వాత పాన్, మదింపు సంవత్సరం (AY 2023-24), పేమెంట్ విధానం, అడ్రస్, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ తదితర వివరాలు ఇవ్వాలి.
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
- ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో పాన్ ఆధార్ను పూర్తి చేయాలి.
పూర్తి చేయకుంటే ఇబ్బందే!
- చెల్లుబాటులో లేని పాన్తో బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాల్లాంటివి తెరవలేరు.
- మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి.
- ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు.
- డీమ్యాట్ ఖాతా ఉన్నా షేర్లలో మదుపు చేయడం సాధ్యం కాదు.
- మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) విధించాల్సిన చోట అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది.
- సెక్యూరిటీస్ మార్కెట్లోని అన్ని లావాదేవీలకు పాన్ కీలక గుర్తింపు. కాబట్టి, తప్పనిసరిగా ఇది చెల్లుబాటులో ఉండాల్సిందే.
- పాన్-ఆధార్ అనుసంధానం లేకపోతే కేవైసీ నిబంధనలు పాటించనట్లుగా భావించి పెట్టుబడి లావాదేవీలపై పరిమితులు ఉండొచ్చని సెబీ ఇప్పటికే తెలిపింది. ఈ రెండూ జత చేస్తేనే సాఫీగా పెట్టుబడి లావాదేవీలు సాగుతాయని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. -
EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్లైన్లో సులువుగా..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్లైన్ ఫారమ్తో సులువుగా మార్చుకోవచ్చు. -
Indian Railways: ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!
train ticket lost: ట్రైన్ టికెట్ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే.. -
Solar rooftop: ‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. -
FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ.. -
PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే?
PM Kisan 16th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
పేటీఎం ఫాస్టాగ్లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. -
8 ఏళ్లలో రూ.45లక్షలు..
నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? -
IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి -
PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం.. ‘రూఫ్టాప్ సోలార్’ కోసం దరఖాస్తు ఇలా..
PM Surya Ghar- Muft Bijli Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించింది. దీని కింద ‘రూఫ్టాప్ సోలార్’ కోసం దరఖాస్తు చేసుకోండిలా..! -
Blue Aadhaar: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా?
Blue Aadhaar Card: యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. దీన్ని బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తారు. -
Fastag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్హెచ్ఏఐ
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది. -
Cashless: ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్.. నేటి నుంచే అమల్లోకి
Cashless facility at all hospitals: దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్’ కౌన్సిల్ వెల్లడించింది. -
FASTags: ఫాస్టాగ్కు కేవైసీ.. జనవరి 31 డెడ్లైన్!
కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్లు జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్ లేదా బ్లాక్ అవుతాయని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. -
ఆ అకౌంట్లపై మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలొద్దు.. బ్యాంకులకు RBI ఆదేశం
RBI on minimum balance charges: రెండేళ్లకు పైగా వాడుకలో లేని ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించలేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
IPL: బెరెన్డార్ఫ్ ఔట్.. ఇంగ్లాండ్ పేసర్కు ముంబయి ఇండియన్స్ పిలుపు
-
Online Voting: వారికి ఆన్లైన్ ఓటింగ్ కల్పించాలి: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
-
Medicine Racket: నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ ముమ్మర దాడులు