IPO: ఈ రోజే మూడు ఐపీఓలు.. రూ.1,511 కోట్ల సమీకరణే లక్ష్యం
IPO: మోతీసన్స్ జువెలర్స్, ముత్తూట్ మైక్రోఫిన్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓలు సోమవారం ప్రారంభమయ్యాయి. 20వ తేదీ వరకు ఈ కంపెనీల షేర్ల కోసం బిడ్లు దాఖలు చేయొచ్చు.
IPO | దిల్లీ: ఈ రోజు మూడు కంపెనీల ఐపీఓలు (IPO) ప్రారంభమయ్యాయి. రిటైల్ ఆభరణాల కంపెనీ మోతీసన్స్ జువెలర్స్, ముత్తూట్ మైక్రోఫిన్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కలిపి మొత్తం రూ.1,511 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి.
ముత్తూట్ మైక్రోఫిన్
ఈ రోజు ఐపీఓకి (IPO) వచ్చిన కంపెనీల్లో ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్నకు చెందిన ముత్తూట్ మైక్రోఫిన్ (Muthoot Microfin IPO) ఒకటి. దీని షేరు ధరల శ్రేణిని రూ.277-291గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 20న సబ్స్క్రిప్షన్ ముగుస్తుంది. మొత్తం రూ.960 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో రూ.760 కోట్లను కొత్త షేర్ల విక్రయం ద్వారా.. మిగిలిన రూ.200 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఐపీఓలో (Muthoot Microfin IPO) విక్రయిస్తున్న షేర్లలో క్యూఐబీలకు 55 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం చొప్పున కేటాయించారు. రిటైల్ మదుపరులు కనీసం 51 షేర్లకు (లాట్) బిడ్లు దాఖలు చేయాలి. అంటే కనీసం రూ.14,841 పెట్టుబడి పెట్టాలి. ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ బంగారం తాకట్టు రుణాలతో పాటు తమ అనుబంధ సంస్థల ద్వారా సాధారణ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ లోన్స్ను అందిస్తుంటుంది. ఈ గ్రూప్ నుంచి వస్తున్న రెండో ఐపీఓ ఇది. గతంలో ద్విచక్ర వాహన రుణాలు అందించే ముత్తూట్ క్యాపిటల్ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ముత్తూట్ మైక్రోఫిన్ సంస్థకు 32 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. తిరువనంతపురానికి చెందిన ఈ కంపెనీకి 18 రాష్ట్రాల్లో 1,340 శాఖలు ఉన్నాయి. 12,290 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Credit Card: పరిమితంగా వాడితేనే..
సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్
సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓ (Suraj Estate Developers IPO) సైతం ఈరోజే ప్రారంభమైంది. 20వ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తం రూ.400 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని షేరు ధరల శ్రేణిని రూ.340-360గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి విక్రయాలు లేవు.
ఈ ఐపీఓ (Suraj Estate Developers IPO) ద్వారా వచ్చిన నిధులను సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ తమ రుణ చెల్లింపులతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈ సంస్థ దక్షిణ మధ్య ముంబయి ప్రాంతంలో పలు గృహ, వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులను చేపట్టింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.273 కోట్ల నుంచి రూ.306 కోట్లకు పెరిగింది. అదే సమయంలో లాభం రూ.26.50 కోట్ల నుంచి రూ.32 కోట్లకు ఎగబాకింది.
ఈ ఐపీఓలో (Suraj Estate Developers IPO) ఇన్వెస్టర్లు కనీసం 41 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,760 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐటీఐ క్యాపిటల్, ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ ఈ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈ షేర్లు నమోదు కానున్నాయి.
మోతీసన్స్ జువెలర్స్
జయపురకు చెందిన రిటైల్ ఆభరణాల కంపెనీ మోతీసన్స్ జువెలర్స్ ఐపీఓ (IPO) నేడు ప్రారంభమై 20వ తేదీన ముగియనుంది. ఐపీఓ (Motisons Jewellers IPO)లో షేరు ధరల శ్రేణిని రూ.52-55గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ (Motisons Jewellers IPO)లో మొత్తం 2.74 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లను విక్రయించడం లేదు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.151 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను మోతీసన్స్ జువెలర్స్ రుణ చెల్లింపులు, నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 250 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కనీసం రూ.13,750 పెట్టుబడి అవసరం. ప్రీ-ఐపీఓ ఫండింగ్ రౌండ్లో ఈ కంపెనీ ఇప్పటికే రూ.33 కోట్లు సమీకరించింది. హొలానీ కన్సల్టెంట్స్ ఈ ఐపీఓ (Motisons Jewellers IPO)కి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా వ్యవహరిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదు కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్