Budget 2024: బడ్జెట్లో 12 కీలక ప్రకటనలు.. సీతారామన్ మాటల్లో..
Budget: బడ్జెట్లోని 12 కీలక ప్రకటనలను సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
దిల్లీ: అభివృద్ధిపై తమ ప్రభుత్వ విధానానికి తాజా బడ్జెట్ (Union Budget 2024) ప్రతీక అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చెప్పారు. ద్రవ్య లోటును క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ సారి 4.5 శాతానికి కుదించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
తమ ప్రభుత్వం GDP (గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్) ఆధారంగా ముందుకెళ్తోందని సీతారామన్ తెలిపారు. సరైన విధానాలు, నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. సమర్థమైన పాలన (Governance) వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ఆదాయం పుంజుకోవడం, ప్రజలు తమ భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగడం అభివృద్ధిని (Development) సూచిస్తోందన్నారు. మూడేళ్లుగా ఏడు శాతం వృద్ధి రేటుతో జీ20 దేశాల్లో భారత్ వేగవంతమైన వృద్ధి నమోదు చేయడం ఈ ప్రభుత్వ మెరుగైన పనితీరుకు (Performance) నిదర్శనమన్నారు.
వికసిత్ భారత్ వైపు పయనించేందుకు ‘దిశ - నిర్దేశం’ కింద ఐదు లక్ష్యాలను పెట్టుకున్నట్లు సీతారామన్ వెల్లడించారు. అందులో సామాజిక న్యాయం ఒకటన్నారు. ఇది కేవలం తమకు నినాదం మాత్రమే కాదని దీన్ని ఒక పాలనా విధానంగా అమలు చేస్తున్నామన్నారు. పేదలు, మహిళలు, అన్నదాతలు, యువకులపై ప్రధానంగా దృష్టి సారిస్తూ తమ పాలన కొనసాగించడం రెండో లక్ష్యమని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయటం మూడోది కాగా ఈ ఏడాది మూలధన వ్యయాన్ని 11 శాతం పెంచామన్నారు. సాంకేతికతతో అవకాశాలను సృష్టించుకోవడం నాలుగో లక్ష్యమని వివరించారు. జనాభా వృద్ధి, సంబంధిత సవాళ్లను ఎదుర్కోవటం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ‘దిశ - నిర్దేశం’ కింద చివరి లక్ష్యమని వెల్లడించారు.
బడ్జెట్లోని 12 కీలక ప్రకటనలను సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అవేంటంటే...
- పీఎం ఆవాస్ యోజన కింద మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం
- మధ్య తరగతి కోసం గృహ వసతి
- నెలకు 300 యూనిట్ల (కనీసం) విద్యుదుత్పత్తి కోసం సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల మంజూరు
- ‘లక్పతీ దీదీ’ లక్ష్యాన్ని రెండు కోట్ల మహిళల నుంచి మూడు కోట్లకు పెంపు
- అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు దన్ను
- వికసిత్ భారత్ లక్ష్యంలో తూర్పు రాష్ట్రాల (బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్) పాత్రను కీలకం చేయడం
- రాష్ట్రాలతో సంప్రదించి తర్వాత తరం సంస్కరణలను చేపట్టడం
- మూడు రైల్వే కారిడార్ల ఏర్పాటు
- పట్టణీకరణ
- ప్రైవేట్ రంగం ద్వారా పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోట్ల నిధి
- పర్యటక రంగ అభివృద్ధి
- రాష్ట్రాల్లో సంస్కరణలకు దన్ను
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ పూర్తి ఫ్లాట్గా ముగిసింది. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. -
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దుకావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.
తాజా వార్తలు (Latest News)
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్