LIC Listing: ఎల్ఐసీ లిస్టింగ్కు ఏడాది.. మదుపర్లకు ₹2.4 లక్షల కోట్ల నష్టం!
One Year for LIC Listing: స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ లిస్టయ్యి సరిగ్గా మే 17కు ఏడాది పూర్తయ్యింది. ఏడాదిలో ఏ రోజూ ఇష్యూ ధరను ఎల్ఐసీ తాకకపోవడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఏడాది క్రితం భారీ అంచనాలతో ఐపీఓకు వచ్చిన ఎల్ఐసీ (LIC).. స్టాక్ మార్కెట్లో లిస్టయ్యి సరిగ్గా నేటికి ఏడాది (One Year for LIC) పూర్తయ్యింది. గతేడాది మే 17న లిస్టైన ఎల్ఐసీ.. తొలి రోజే మదుపరులను నిరాశ పరిచింది. ఆ తర్వాత సైతం కోలుకున్న దాఖలాల్లేవు. ఈ ఏడాదిలో ఏ ఒక్క రోజూ ఇష్యూ ధరను తాకిన సందర్భం లేదు. మొత్తానికి లాభాల మాట అటుంచితే.. ఎన్నో ఆశలు రేపిన ఎల్ఐసీ మదుపరులకు రూ.2.4 లక్షల కోట్ల నష్టాన్ని మాత్రం మిగిల్చింది!
ప్రభుత్వ రంగ బీమా కంపెనీ అయిన ఎల్ఐసీలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ప్రభుత్వం జారీ చేసింది. ఇష్యూ ధరను రూ.949గా ప్రభుత్వం పేర్కొంది. సరిగ్గా ఇదే రోజు లిస్టయిన ఎల్ఐసీ.. 8 శాతం డిస్కౌంట్తో మార్కెట్లో అడుగుపెట్టింది. బీఎస్ఈలో రూ.867.20 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.872 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత కూడా షేరు విలువ పడుతూనే ఉంది. బుధవారం (మే 17) రూ.568.25 వద్ద ట్రేడవుతోంది. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే 40 శాతం నష్టపోయింది. ఈ ఏడాదిలో ఏ ఒక్క రోజూ ఇష్యూ ధరకు దరిదాపుల్లోకి ఎల్ఐసీ రాకపోవడం గమనార్హం.
ఐపీఓ సమయంలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.6లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ప్రస్తుతం ఆ విలువ రూ.3.6 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లకు రాబడి ఇవ్వకపోగా.. రూ.2.4 లక్షల కోట్ల నష్టాన్ని ఎల్ఐసీ మిగిల్చింది. నవంబర్-జనవరి మధ్య ఓ దశలో రూ.600-700 స్థాయికి ఎల్ఐసీ షేరు ధర చేరినప్పటికీ.. అదానీ వ్యవహారం తర్వాత మళ్లీ పూర్వ స్థితికి చేరడం గమనార్హం. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా రూ.550 స్థాయికి అటూఇటుగా ట్రేడవుతోంది. అయితే, ఎల్ఐసీ లిస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థాయికి చేరకపోవడానికి పలు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- జీవిత బీమా రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీనే మార్కెట్ లీడర్. అయితే, లాభాల పరంగా మాత్రం ఎల్ఐసీ అంత గొప్ప ఫలితాలను ప్రకటించకపోవడం మదుపరులు ఆసక్తి చూపకపోవడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు.
- ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ.21 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐపీఓ సబ్స్క్రిప్షన్కు ఆరు రోజులు గడువు ఇచ్చారు. అయితే, ఐపీఓకు కేవలం మూడు రెట్లు మాత్రమే స్పందన వచ్చింది. దీనికితోడు లిస్టయిన తొలిరోజే నష్టాలు చవిచూడడం సెంటిమెంట్ను దెబ్బతీసిందని చెప్తున్నారు. దీనివల్ల కరెక్షన్కు గురైన ప్రతిసారీ ఈ తరహా కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి సహజం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
- అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం ఎఫెక్ట్ కూడా ఎల్ఐసీ షేరు ధర పెరగకపోవడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎల్ఐసీ పెట్టుబడుల విలువ సైతం పడిపోయింది. ఆ ప్రభావం ఎల్ఐసీ స్టాక్ ధరపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.