Reliance Retail: రిలయన్స్ చేతికి అర్వింద్ ఫ్యాషన్స్ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం
Reliance: దేశీయ దిగ్గజ రిటైల్ సంస్థగా కొనసాగుతున్న రిలయన్స్ రిటైల్.. అర్వింద్ ఫ్యాషన్స్ బ్యూటీ బిజినెస్ను సొంతం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.216 కోట్లు.
దిల్లీ: రిటైల్ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్న వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మరో ముందడుగు వేసింది. అర్వింద్ ఫ్యాషన్స్ (Arvind Fashions)కు చెందిన సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగాన్ని రిలయన్స్ రిటైల్ (Reliance Retail) అనుబంధ సంస్థ ‘రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లిమిటెడ్’ సొంతం చేసుకుంది. ఇది పూర్తిగా ‘షేర్ల కొనుగోలు ఒప్పంద’మని అర్విద్ ఫ్యాషన్స్ శుక్రవారం వెల్లడించింది. కొనుగోలు ప్రక్రియ పూర్తయితే తమ వాటాలన్నీ రిలయన్స్ రిటైల్ చేతుల్లోకి వెళ్లిపోతాయని తెలిపింది. ఫలితంగా రిలయన్స్ రిటైల్కు ‘అర్వింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్’ అనుబంధ సంస్థగా మారుతుందని వెల్లడించింది.
ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.216 కోట్లని అర్వింద్ ఫ్యాషన్స్ (Arvind Fashions) తెలిపింది. అయితే, దీంట్లో రుణ చెల్లింపులు కూడా భాగమని పేర్కొంది. కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. తమకు రూ.99.02 కోట్లు అందుతాయని వెల్లడించింది. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో ‘అర్వింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్’ టర్నోవర్ రూ.336.70 కోట్లుగా నమోదైంది. అర్వింద్ ఫ్యాషన్స్ ఏకీకృత లాభాల్లో దీని వాటా 7.60%. టిరా బ్రాండ్ పేరిట రిలయన్స్ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని రిటైల్ వ్యాపారాలన్నింటికీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) హోల్డింగ్ కంపెనీ. దేశీయ దిగ్గజ రిటైల్ సంస్థగా కొనసాగుతున్న రిలయన్స్ రిటైల్ భారత్లో వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో హెచ్యూఎల్ లాక్మే, నైకా, టాటా, ఎల్వీఎంహెచ్ సెఫోరాలతో పోటీ పడబోతోంది. రెడ్సీర్, పీక్ ఎక్స్వీ నివేదిక ప్రకారం.. 2027 నాటికి భారత సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 30 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇది ప్రపంచ మార్కెట్లో ఐదు శాతానికి సమానం. శుక్రవారం మధ్యాహ్నం 3:11 గంటల సమయానికి అర్వింద్ ఫ్యాషన్స్ షేరు విలువ 5.78 శాతం పెరిగి రూ.343.50 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ షేరు రూ.2319 దగ్గర ఫ్లాట్గా ట్రేడవుతోంది.
2023 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ వెంచర్ (RRVL) నికర లాభం 21.04% వృద్ధితో రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయాలు 19.48% పెరిగి రూ.68,937 కోట్లుగా నమోదయ్యాయి. అన్ని వినియోగదారు విభాగాల్లో వృద్ధి ఇందుకు కారణంగా నిలిచిందని కంపెనీ పేర్కొంది. మొత్తం స్టోర్ల సంఖ్య 18,446 నుంచి 18,650కు చేరింది. 71.5 మిలియన్ చదరపు అడుగుల్లో ఈ సంస్థల కార్యకలాపాలు నడుస్తున్నాయి. సంస్థ విలువను 100 బిలియన్ డాలర్లకు పైగా నిర్ధారించి, అంతర్జాతీయ పెట్టుబడుదార్ల నుంచి రూ.15,134 కోట్ల వరకు నిధులను కంపెనీ సమీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!