Stock Market: భారీ నష్టాల్లో దేశీయ సూచీలు.. 21,550 దిగువకు నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 707 పాయింట్లు నష్టపోయి 70,847 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 198 పాయింట్లు కోల్పోయి 21,545 దగ్గర కొనసాగుతోంది.

Updated : 14 Feb 2024 09:52 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 707 పాయింట్లు నష్టపోయి 70,847 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 198 పాయింట్లు కోల్పోయి 21,545 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.11 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఐటీసీ, ఎం అండ్‌ ఎం, మారుతీ, రిలయన్స్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాల్లో ముగిశాయి. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా నమోదుకావటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు కుంగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గత 24 గంటల్లో స్వల్పంగా తగ్గి 82.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.376.32 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.273.94 కోట్ల విలువ చేసే వాటాలను కొన్నారు.

ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎండీసీ స్టీల్‌, నాట్కో ఫార్మా, జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, గ్లాండ్‌ ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఇప్కా ల్యాబ్స్‌, నారాయణ హృదయాలయ, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వోఖార్డ్‌, పీసీ జువెలర్స్‌, లిబర్టీ షూస్‌ త్రైమాసిక ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని