Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 18,300 పైకి నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 234 పాయింట్ల లాభంతో 61,963.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 111 పాయింట్లు లాభపడి 18,314.40 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. కానీ, కొద్దిసేపట్లోనే కొనుగోళ్ల అండతో లాభాల్లోకి ఎగబాకాయి. రోజంతా అదే తీరును కొనసాగించాయి. ఐటీ రంగ షేర్లతో పాటు రిలయన్స్, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లు రాణించాయి. దీనికి అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ ర్యాలీ కూడా జతైంది.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 61,579.78 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,044.46 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 234 పాయింట్ల లాభంతో 61,963.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,201.10 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,335.25 దగ్గర గరిష్ఠానికి చేరింది. చివరకు 111 పాయింట్లు లాభపడి 18,314.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు పతనమై 82.38 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఎల్అండ్టీ, సన్ఫార్మా, ఐటీసీ, టైటన్, మారుతీ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ గ్లాండ్ఫార్మా షేరు విలువ గత రెండు సెషన్లలో 33 శాతానికి పైగా పతనమైంది. ఇంట్రాడేలో రూ.861 దగ్గర 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 16.12 శాతం నష్టంతో రూ.893.85 దగ్గర నిలిచింది.
☛ సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు ఈరోజు రాణించాయి. 10 నమోదిత కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు విలువ 19.55 శాతం లాభపడి రూ.2,338.55 దగ్గర స్థిరపడింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటింది.
☛ మార్చి త్రైమాసికంలో సానుకూల ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. మధ్యాహ్నం రూ.66.85 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో చివరకు 3.41 శాతం నష్టపోయి రూ.62.30 దగ్గర స్థిరపడింది.
☛ బీఎస్ఎన్ఎల్ 4జీ అమలు కాంట్రాక్టును టీసీఎస్ నేతృత్వంలోని కన్షార్షియం సొంతం చేసుకుంది. టీసీఎస్ షేరు ఈరోజు 2.15 శాతం పుంజుకొని రూ.3,292 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ