Tata group: టాటా గ్రూప్ ఘనత.. మార్కెట్ విలువ ₹30 లక్షల కోట్లు
Tata group: టాటా గ్రూప్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రూప్ మార్కెట్ విలువ రూ.30 లక్షల కోట్లు దాటింది. ఈ మైలురాయిని అందుకున్న తొలి గ్రూప్గా రికార్డుకెక్కింది.
Tata group | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ (Tata group) అరుదైన ఘనత సాధించింది. దేశీయ కంపెనీల్లో ఏ కంపెనీ ఇప్పటివరకు అందుకోని రికార్డ్ను సొంతం చేసుకుంది. తొలిసారి గ్రూప్ మార్కెట్ విలువ (market cap) రూ.30 లక్షల కోట్లు దాటింది. ఇటీవల కాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్ షేర్లు రాణించడంతో.. టాటా గ్రూప్ ఈ రికార్డు అందుకుంది.
టాటా గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేరు ఈ ఏడాది (2024) ఇప్పటివరకు 9 శాతం మేర రాణించింది. టాటా మోటార్స్ సైతం 20 శాతం మేర లాభపడింది. టాటా పవర్ 18 శాతం, ఇదే గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్స్ షేర్లు 16 శాతం చొప్పున లాభపడ్డాయి. టాటా గ్రూప్నకు చెందిన 24 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉన్నాయి. అయితే, ఇదే గ్రూప్నకు చెందిన తేజస్ నెట్వర్క్, టాటా ఎలెక్సీ, టాటా కెమికల్ షేర్లు 10 శాతం మేర ఈ ఏడాది నష్టపోయాయి. మిగిలిన స్టాక్స్ 1-5 శాతం మేర లాభపడ్డాయి.
త్వరలో పసిడి బాండ్ల సబ్స్క్రిప్షన్.. ఆన్లైన్లో ఎలా కొనాలి?
టీసీఎస్ ఒక్కటే..
టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పెరుగుదలలో టీసీఎస్ది కీలక భూమిక. ఇటీవల ఆ కంపెనీ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మూడో త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు పేర్కొంది. దీంతో గత కొన్ని రోజులుగా రాణిస్తున్న ఈ కంపెనీ షేరు.. మంగళవారం మరో 3 శాతానికి పైగా లాభపడి కంపెనీ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లు దాటింది. అంటే టాటా గ్రూప్ మొత్తం కంపెనీల విలువలో టీసీఎస్ వాటా సగం కంటే ఎక్కువ.
మరోవైపు చిప్ కొరత, ముడిసరకు ధరలు తగ్గడం, వాహనాలకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో టాటా మోటార్స్ మెరుగైన అమ్మకాలు నమోదు చేసింది. పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో టాటా పవర్ రాణించింది. పర్యటక రంగానికి పెరుగుతున్న డిమాండ్ ఇండియన్ హోటల్స్కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా షేర్లు రాణించాయి. టాటా గ్రూప్ సరికొత్త మైలురాయిని చేరుకోవడంలో కీలక భూమిక పోషించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.