Tecno Phantom V Flip 5G: టెక్నో నుంచి రూ.50 వేల ఫ్లిప్‌ ఫోన్‌.. ఫీచర్లివే..!

Tecno Phantom V Flip 5G: టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌  (Tecno Phantom V Flip) 5జీ ఫోన్‌లో వెనుక భాగంలో 64MP ప్రధాన సెన్సార్‌, 13MP వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో కెమెరా సెటప్‌ ఇస్తున్నారు.

Updated : 22 Sep 2023 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌ 5జీ (Tecno Phantom V Flip 5G) ఫోన్‌ భారత్‌లో శుక్రవారం విడుదలైంది. టెక్నో నుంచి వచ్చిన రెండో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇది. ‘ఫాంటమ్‌ వీ ఫోల్డ్‌’ పేరిట వచ్చిన తొలి ఫోన్‌ ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి ప్రవేశించింది. తాజా వీ ఫ్లిప్‌ 5జీ ఫోన్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. సర్క్యులర్‌ ఔటర్‌ డిస్‌ప్లే, దాని చుట్టూ కెమెరా సెటప్‌ ఆకట్టుకుంటోంది.

టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌ 5జీ ధర (Tecno Phantom V Flip Price)..

టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌ 5జీ (Tecno Phantom V Flip) ఫోన్‌ ఐకానిక్‌ బ్లాక్, మిస్టిక్‌ డాన్‌ రంగుల్లో లభించనుంది. 8GB RAM + 256GB వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.49,999. అక్టోబర్‌ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమెజాన్‌లో విక్రయానికి వస్తుంది.

టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌ 5జీ ఫీచర్లు (Tecno Phantom V Flip Features)..

టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌  (Tecno Phantom V Flip) 5జీ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లే ఉంది. పైన ఉండే సర్క్యులర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 1.32 అంగుళాలతో వస్తోంది. ఇక్కడి నుంచే సందేశాలకు రిప్లయ్‌ ఇవ్వొచ్చు. దీంట్లో మీడియాటెక్‌ 8050 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 16జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌‌ 13.5 ఓఎస్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు రెండేళ్ల వరకు ఓఎస్‌ అప్‌డేట్లు అందించనున్నారు. మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌  (Tecno Phantom V Flip) 5జీ ఫోన్‌లో వెనుక భాగంలో 64MP ప్రధాన సెన్సార్‌, 13MP వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో కెమెరా సెటప్‌ ఇస్తున్నారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను పొందుపర్చారు. 5జీ, వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్‌ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 45వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీని అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని