UK recession: మాంద్యంలోకి యూకే.. ఎన్నికల ముందు సునాక్కు షాక్
UK fell into recession: బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. ఎన్నికల ముందు రిషి సునాక్కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారనుంది.
UK recession | లండన్: బ్రిటన్ (UK) ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. చివరి మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3 శాతం క్షీణించినట్లు అక్కడి జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. సేవలు, పారిశ్రామికోత్పత్తి, నిర్మాణరంగంలో స్తబ్ధత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జీడీపీ క్షీణత 0.1 శాతం ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి క్షీణించడం గమనార్హం. ఎన్నికల ఏడాది బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఇది ఇబ్బంది పెట్టే అంశమనే చెప్పాలి.
సాధారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీలో మందగమనం నమోదైతే దాన్ని మాంద్యంగా వ్యవహరిస్తారు. బ్రిటన్ జీడీపీ అంతకుముందు త్రైమాసికంలోనూ 0.1 శాతం క్షీణించింది. దీంతో చివరి త్రైమాసికంలో మాంద్యంలోకి జారుకున్నట్లయ్యింది. 2020 తొలి అర్ధభాగంలో వృద్ధి నెమ్మదించడంతో బ్రిటన్ ఒకసారి మాంద్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి.
పేటీఎం ఎగ్జిక్యూటివ్లను ప్రశ్నించిన ఈడీ!
బ్రిటన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి ఈ పరిణామం గట్టి షాక్ అనే చెప్పాలి. ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని రిషి సునాక్ తేదీలను నిర్ణయించాల్సి ఉంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాక్కు ఇది ఓ విధంగా ఇబ్బంది కలిగించే విషయం కానుంది. ఇప్పటికే వెల్లడవుతున్న వివిధ ఓపీనియన్ పోల్స్లో లేబర్ పార్టీ కంటే ఆ పార్టీ వెనకంజలో ఉంది.
మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. బ్రిటన్లో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠమైన 11 శాతానికి చేరడంతో.. 2022 నుంచి గతేడాది ఆగస్టు వరకు వివిధ సందర్భాల్లో కీలక వడ్డీ రేట్లను సున్నా నుంచి 5.25 శాతానికి చేర్చింది. ప్రస్తుతం యూకేలో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నిర్దేశించుకున్న 2 శాతం లక్ష్యానికి చేరువైతే.. వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో వృద్ధికి ఊతం లభిస్తుంది. అదే సమయంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే.. ఆ మేర వినిమయం పెరిగి మళ్లీ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది.
జపాన్ సైతం మాంద్యంలోకి..
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ సైతం మాంద్యంలోకి జారుకుంది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధిలో వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం క్షీణత నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 0.1 శాతం కుంగింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 3.3 శాతం మేర జీడీపీ క్షీణించింది. దీంతో జపాన్ సైతం మాంద్యంలోకి వెళ్లినట్లయి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్.. నాలుగో స్థానానికి చేరింది. జర్మనీ మూడో స్థానానికి చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. లాభాల్లో సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!