అప్పు చేసి.. వేచి చూడు
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండలో ఉపాధిహామీ పథకంలో మంజూరైన ఈ సీసీ రోడ్డును రూ.5 లక్షలు వెచ్చించి ఇటీవలే పూర్తిచేశారు. ఇలాంటివి మూడు రహదారులను రూ.15 లక్షలతో
ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సర్పంచులకు అవస్థలు
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండలో ఉపాధిహామీ పథకంలో మంజూరైన ఈ సీసీ రోడ్డును రూ.5 లక్షలు వెచ్చించి ఇటీవలే పూర్తిచేశారు. ఇలాంటివి మూడు రహదారులను రూ.15 లక్షలతో పనులు పూర్తిచేశారు. ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తుందని సర్పంచి తెలిపారు. ఇలా మరో ప్రజాప్రతినిధి నిర్మించిన రహదారికి గత మూడేళ్లుగా డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పనులు చేస్తే వడ్డీలు చెల్లించడం కష్టంగా మారిందన్నారు.
మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే
పనులు చేసి ప్రజల్లో పేరుతెచ్చుకోవాలనే లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల సర్పంచులు అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తిచేశారు. నెలలు గడుస్తున్నా చేసిన పనుల బిల్లుల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. పనుల కోసం ఉపాధిహామీ, ఎస్ఎఫ్సీ, ఎమ్మెల్యే నిధులు ఇలా అనేక రకాలుగా చెల్లిస్తామని చెప్పడంతో పనులు చేశారు. గత మార్చి నుంచి ఇంతవరకు సర్పంచులు రాసిన చెక్కులు చెల్లడం లేదు. నిధులపై ఫ్రీజింగ్ పెట్టడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. పక్కాగా మంజూరయ్యే పనులను గుత్తేదారులకు కేటాయించిన అధికారులు, డబ్బులు బకాయిపడే అవకాశం ఉండే పనులను మాత్రం సర్పంచులతో చేయించి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నిధుల కోసం నిరీక్షణ..
ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో అనేక రకాల అభివృద్ధి పనులను సర్పంచులు చేశారు. వీటికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. గత మూడు నెలల కాలంలో కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాలని వారు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతుండగా ఆ నిధులు పంచాయతీ అవసరాలైన పారిశుద్ధ్యం, సిబ్బంది జీతభత్యాలు, ఇతర చిన్నచిన్న పనులకే సరిపోతున్నాయని వాపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజూరు కావడం లేదు. ఉపాధిహామీ పథకం ద్వారా చేసిన సీసీ రహదారులు, ఇతర పనులకు నిధులు చెల్లించడం లేదు. ఎమ్మెల్యే నిధులతో చేసిన పనులకు పలు పంచాయతీల్లో బకాయిలు ఇవ్వలేదంటున్నారు. పంచాయతీల ఖాతాలోని జనరల్ నిధులను తీసుకోకుండా ఫ్రీజింగ్ పెట్టి సర్పంచులపై ఆర్థికభారం మోపుతున్నారని మండిపడుతున్నారు. చిన్న చిన్న పంచాయతీల్లో ట్రాక్టర్ల డీజిల్, బ్యాంకులోన్లు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం వీధిదీపాలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే లక్ష్యంతో సర్పంచులతో బలవంతంగా తీర్మాణాలు చేయిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో లేనప్పటికీ తీర్మాణాలు చేయడమేమిటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ‘మన ఊరు - మన బడి’ పనులను గుత్తేదారులకు అప్పగించి ఇతర పనులను సర్పంచులకు ఇవ్వడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగు బిల్లులను చెల్లించాలని లేనిపక్షంలో ఆ ప్రభావం వచ్చే నెలలో ప్రారంభించే ‘పల్లెప్రగతి’పై చూపిస్తామని సర్పంచులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని పంచాయతీల చెల్లింపులే ఆగాయి
- నారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల
కొన్ని పంచాయతీల్లో సాధారణ నిధులకు సంబంధించిన చెక్కులు ఎస్టీవో కార్యాలయంలో ఆగినట్లు సమాచారం ఉంది. ట్రాక్టర్లకు సంబంధించిన చెక్కులు ప్రాసెస్లో ఉన్నాయి. ఏ క్షణమైనా చెల్లించే అవకాశం ఉంది. సీసీ రహదారులు, ఇతర నిధుల బిల్లుల బకాయిలు ఆయా శాఖలకే తెలియాలి. పలువురు సర్పంచులైతే నిధులు ఆగినట్లు పేర్కొన్నమాట వాస్తవమే. చెక్కులు రాసిన కొద్ది రోజులకే మంజూరవుతాయి. ఇటీవల కొంతమేరకు జాప్యమేర్పడింది.
ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల వివరాలివే...
ఆదిలాబాద్ 468
మంచిర్యాల 311
కుమురంభీం 335
నిర్మల్ 396
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భగత్ సింగ్ నగర్లో సీపీఎం విస్తృత ప్రచారం
[ 10-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో సీపీఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. -
హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బృందం
[ 10-05-2024]
హజ్ యాత్రకు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి 29 మంది గల సభ్యుల బృందం గురువారం రాత్రి బయలుదేరింది. -
పట్టణంలో పోలీసుల కవాతు
[ 10-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. -
మూడోసారి మోదీ ప్రధాని కావాలి
[ 10-05-2024]
మోదీ మూడోసారి ప్రధాని కావాలని, అందుకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో భాజపాను గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. -
మాజీ సర్పంచులు కాంగ్రెస్లో చేరిక
[ 10-05-2024]
తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
బంగారం దుకాణాల్లో సందడి
[ 10-05-2024]
అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణాల్లో వినియోగదారుల సందడి నెలకొంది. -
పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి
[ 10-05-2024]
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం
[ 10-05-2024]
పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. -
సరిహద్దుపై నజర్
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. -
బాధ్యతగా ఓటేద్దాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. -
గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం
[ 10-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. -
ఓటరు చీటీ అందలేదా.. ఇలా తెలుసుకోండి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు. -
ఎంపీగా గెలిచిన వారికి వసతులు బోలెడు
[ 10-05-2024]
ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది. -
గ్రామస్థులను పలకరించి... కన్నీళ్లు పెట్టుకొని
[ 10-05-2024]
‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను. -
ఓటు వేయడం.. బాద్యతగా భావిద్దాం
[ 10-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. -
ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. -
ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఇక రెండు రోజులే..
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. -
అనుమతి ఒకటి.. చేసేది మరొకటి!
[ 10-05-2024]
రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది. -
ఫోన్ చేయండి.. కథలు వినండి!
[ 10-05-2024]
కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు. -
చరవాణికి బానిసై విద్యార్థి ఆత్మహత్య
[ 10-05-2024]
చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు