మీనం.. విడుదలకు సన్నద్ధం
మత్స్యకారుల ఉపాధి కల్పన కోసం జలవనరుల్లో ఉచిత చేప పిల్లల విడుదలకు జిల్లా శాఖ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా మరో వారం రోజుల్లో తటాకాలు, జలాశయాల్లో వీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి భారీ వర్షాలకు జల వనరుల్లో వరద చేరి నిండుకుండల్లా మారాయి.
1.37 కోట్ల చేప పిల్లలు వేసేలా చర్యలు
ఆసిఫాబాద్, న్యూస్టుడే
చేప పిల్లలను విడుదల చేస్తున్న అధికారులు, మత్స్యకారులు (పాత చిత్రం)
మత్స్యకారుల ఉపాధి కల్పన కోసం జలవనరుల్లో ఉచిత చేప పిల్లల విడుదలకు జిల్లా శాఖ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా మరో వారం రోజుల్లో తటాకాలు, జలాశయాల్లో వీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి భారీ వర్షాలకు జల వనరుల్లో వరద చేరి నిండుకుండల్లా మారాయి. వానలు కాస్త తగ్గుముఖం పట్టగానే విడుదల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో మత్స్య సహకార సంఘాలు 43 ఉన్నాయి. కొత్తగా మరో పది సంఘాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిలో 2500 మంది వరకు సభ్యులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 260 చెరువులు, మరో 14 జలాశయాలు, పెద్ద చెరువుల్లో 1.37 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేలా మత్స్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించారు. గతంలో మత్స్యశాఖ పరిధిలో 45 చెరువులు ఉండగా.. మిగతావి ఆయా పంచాయతీల పరిధిలోనే ఉండేవి. ఈసారి అన్ని చెరువులు మత్స్యశాఖ పరిధిలోకి వచ్చాయి. ప్రభుత్వ పరంగానే జల వనరుల్లో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తారు. వాటిని చెరువుల పరిధిలోని సంబంధిత మత్స్యకార సంఘాలే పట్టుకోవచ్చు. సంఘాలు లేని చోట ఆయా చెరువులను వేలం ద్వారా అప్పగిస్తారు. పాట పాడిన వారే చేపలను పట్టుకోవచ్చు.
మత్స్యకారులకు ఉపాధి.. పంచాయతీలకు ఆదాయం
చెరువులు, జలాశయాల్లో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లను విడుదల చేయడంతో మత్స్య కార్మికులకు ఉపాధితో పాటు సంబంధిత పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువుల వేలంలో వచ్చిన ఆదాయాన్ని పంచాయతీలకే కేటాయిస్తారు. వంద ఎకరాల ఆయకట్టుపై ఉన్న చెరువులకు వేసే వేలం పాటలో వచ్చిన ఆదాయంలో 30 శాతం సంబంధిత పంచాయతీలకు, 70 శాతం మత్స్యశాఖ(ప్రభుత్వానికి)కు కేటాయిస్తారు. జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టులోపు ఉన్న చెరవులు 150, ఆపై ఉన్నవి 123 వరకు ఉన్నాయి. వీటిలో సంఘాలున్న చెరువులు 161 వరకు ఉన్నాయి. ఇంకా 112 చెరువులకు సంబంధించి సంఘాలు లేవు. వాటికి వేలం నిర్వహించి చేపలు పట్టేందుకు అప్పగిస్తారు. వాటిలో ఇప్పటి వరకు 13 చెరువులకు వేలం వేయగా.. రూ.3.82 లక్షల ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. గతేడాది మత్స్య శాఖ ఆధ్వర్యంలోని 45 చెరువులకు వేలం వేయగా రూ.4.12 లక్షల ఆదాయం సమకూరింది.
చేపల చెరువులకు దరఖాస్తుల స్వీకరణ..
చేపల పెంపకంపై ఆసక్తి ఉండి చెరువులు నిర్మించుకునేవారు, చేపల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసే వారి నుంచి జిల్లా మత్స్యశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కనీసం 2.5 ఎకరాలకు తగ్గకుండా ఉన్న సొంత భూమిలో చేపల చెరువులు నిర్మిస్తేనే ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. చెరువు తవ్వడానికి రూ.ఏడు లక్షలు, చేప పిల్లల కొనుగోలు, వాటికి ఫీడింగ్, ఇతరాత్ర వాటికి రూ.4 లక్షలు అంటే మొత్తం రూ.11 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60శాతం, ఇతరులకు 40 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 40 మంది చెరువుల తవ్వకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
* జిల్లాలో చేప పిల్లల విడుదలకు అనుకూలమైన చెరువులు: 260
* విడుదల చేసే పిల్లలు: 65.80 లక్షలు
* ప్రాజెక్టులు, పెద్ద చెరువులు: 14
* వీటిలో విడుదల చేసే పిల్లలు: 71,29,500
* విడుదల చేసే చేప పిల్లల రకాలు: కట్ల, రవ్వు, బంగారుతీగ, మ్రిగాల
త్వరలో ప్రక్రియ ప్రారంభం
సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లాలో 274 చెరువులు, ప్రాజెక్టుల్లో 1.37 కోట్ల చేప పిల్లలు విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏకధాటిగా కురుస్తున్న వానల వల్ల వేచి చూస్తున్నాం. మరో వారం రోజుల్లో విడుదల ప్రక్రియ ప్రారంభిస్తాం. కిందటి సారి ఆరు వేల టన్నుల ఉత్పత్తి వచ్చింది. మత్స్య కారులకు సుమారు రూ.4.80 కోట్ల ఆదాయం వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓటు వినియోగించుకున్న పోలీసులు
[ 04-05-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు శనివారం పోస్టల్ ఓటును వినియోగించుకున్నారు. -
డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి
[ 04-05-2024]
తీవ్రమైన ఎండల దృష్ట్యా ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న కాకతీయ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
[ 04-05-2024]
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కే.ప్రభాకర్ రావును కలెక్టర్ రాజర్షి షా ఆయన చాంబర్లో శనివారం మర్యాదపూర్వకంగా -
భాజపా వస్తే ప్రజాస్వామ్యం పతనం
[ 04-05-2024]
భాజపాకు మళ్ళీ అధికారం ఇస్తే ప్రజాస్వామ్యం మరింత పతనమవుతుందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉషా కిరణ్ ఆరోపించారు. -
పోలీసుల తనిఖీల్లో నగదు పట్టివేత
[ 04-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
జిల్లా కేంద్రానికి చేరుకున్న ఓటర్ల చైతన్య యాత్ర
[ 04-05-2024]
విద్య, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి భాజపా వ్యతిరేకం అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆకునూరి మురళీ ... -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
[ 04-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన ఇచ్చోడ మండలం సాత్ నంబర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. -
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
[ 04-05-2024]
ఉమ్మడిజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగువారాలపాటు తీర్పును సస్పెన్షన్లో పెట్టింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ఇప్పుడు హైకోర్టుతీర్పు అంతే ప్రాధాన్యతాంశంగా మారింది. -
భరోసా నింపేందుకు భారాస అధినేత రాక
[ 04-05-2024]
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గత ఏడాది నవంబరు 24న మంచిర్యాల జిల్లా నస్పూర్లో నిర్వహించిన ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంచిర్యాలలో రోడ్షో నిర్వహించనున్నారు. -
గోదాములకు సీల్.. వ్యాపారుల గోల్మాల్
[ 04-05-2024]
రైస్ మిల్లు యజమాని లీజుకు తీసుకున్న గోదాములను బ్యాంకు అధికారులు సీజ్ చేయడంతో అందులోని ధాన్యం నిల్వల సంగతేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ గోదాములను అద్దెకిచ్చిన యజమాని బ్యాంకు అప్పు చెల్లించడం లేదని ఎస్బీఐ అధికారులు వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
ముందే ఓటేశారు!
[ 04-05-2024]
పోలింగ్ తేదీకి ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు ఓటేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్ ఓటును, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. -
ఇంటర్లో అందలం.. పదిలో అధమం
[ 04-05-2024]
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది. -
జిల్లా జోలికొస్తే భీం స్ఫూర్తిగా పోరాడుతాం
[ 04-05-2024]
అబద్ధపు గ్యారెంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
అక్రమ దందా.. ఆ ఇద్దరి అండ
[ 04-05-2024]
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పెద్దలకు కాసులు కురిపిస్తోంది. పీడీఎస్ బియ్యం అక్రమ దందా మూడు బస్తాలు, ఆరు వాహనాలుగా విరాజిల్లుతూ వారి జేబులు నింపుతోంది. నేతల అండదండలతో అది శ్రుతిమించుతోంది. -
నిప్పుల కొలిమి
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటివారంలోనే ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. -
ఫోన్ చేయండి.. కథ వినండి
[ 04-05-2024]
వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. -
ఉపాధిహామీ పథకం రద్దుకు భాజపా కుట్ర: మంత్రి
[ 04-05-2024]
కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. -
ఆ రెండు గ్రామాల వారు ఓటేసేది ఇక్కడే
[ 04-05-2024]
-
‘నిర్మల్ చరిత్ర’ పుస్తక రచయిత మృతి
[ 04-05-2024]
చారిత్రక ప్రాశస్త్యమున్న నిర్మల్ విశేషాలను ‘నిర్మల్ చరిత్ర’ పేరిట పుస్తకరూపంలో తీసుకొచ్చిన రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు అంకం రాములు (76) గురువారం రాత్రి మృతిచెందారు. -
హామీలను విస్మరించి భాజపా పాలన
[ 04-05-2024]
ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం విస్మరించి పదేళ్లు పాలన సాగించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) జిల్లా సమన్వయకర్తలు ఆకునూరి మురళి, నైనాల గోవర్ధన్ అన్నారు. -
విద్యుత్తు.. కారాదు విపత్తు
[ 04-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు. -
గోస తీర్చాలి.. బాసటగా నిలవాలి
[ 04-05-2024]
పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి. -
నాయకా.. ఆరోగ్యమూ ముఖ్యమే
[ 04-05-2024]
మండుటెండల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది. ప్రచారానికి మిగిలింది ఎనిమిది రోజులు మాత్రమే. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
సైబర్ కేసులో మరో ముగ్గురు..!
[ 04-05-2024]
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూర్చిన కేసులో ఇదివరకే పట్టణానికి చెందిన షిండే ప్రణయ్ను సైబర్ క్రైం బ్యూరో (సీసీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్