స్వైన్ఫ్లూ వచ్చేసింది.. జర జాగ్రత్త
జిల్లా వాసులు రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. దీని కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఇప్పటికీ కొవిడ్ కేసులు ప్రతి రోజు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలానుగుణ వ్యాధులు వెంటాడుతుండటంతో మరింతగా కుంగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ఫ్లూ కేసు నమోదు కావడం కలకలంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో దీర్ఘకాలం అనంతరం మొదటి కేసు నమోదు
ఆదిలాబాద్ వైద్య విభాగం, న్యూస్టుడే
వివిధ వ్యాధుల బారిన పడి రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులు
జిల్లా వాసులు రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. దీని కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఇప్పటికీ కొవిడ్ కేసులు ప్రతి రోజు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలానుగుణ వ్యాధులు వెంటాడుతుండటంతో మరింతగా కుంగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ఫ్లూ కేసు నమోదు కావడం కలకలంగా మారింది. 1919లో ఈ వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడించింది. జిల్లాలో రెండున్నరేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోగా.. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో ఓ మహిళకు ఈ వ్యాధి నిర్ధారణ కావటం వైద్య వర్గాలను విస్మయానికి గురి చేస్తుండగా, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కాలానుగుణ వ్యాధులు ప్రారంభమయ్యాయి. ఏ ఇంట్లో చూసినా జలుబు, విరేచనాలు లేదా జ్వరాలతో బాధపడుతున్న వారు ఒక్కరైనా ఉంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,438 మంది జ్వరాల బారిన పడ్డారు. 49 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు గతేడాది రెండు నమోదు కాగా ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు నమోదు కాలేదు. కాని కొత్తగా స్వైన్ఫ్లూ కేసు నిర్ధారణ కావడంతో అంతటా ఆందోళనకు గురవుతున్నారు.
బయట పడిందిలా..
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహిళ ఒకరు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో అయిదు రోజుల కిందట రిమ్స్లో చేరారు. కరోనా లక్షణాలుండటంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సలు అందజేశారు. ఇలాంటి లక్షణాలే ఉన్న మరో నలుగురి నమూనాలను హైదరాబాద్కు పంపించారు. స్వైన్ఫ్లూ బాధితురాలికి స్థానికంగా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్ ఫలితాలు వెలువడ్డాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫలితాలతో ఆమెకు స్వైన్ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు నివేదికలు వచ్చాయి. మిగతా నలుగురికి నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. కాగా స్వైన్ఫ్లూ బాధితురాలు ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ప్రజారోగ్య సిబ్బంది బాధితురాలి ఇంటిల్లిపాది నమూనాలను సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపించారు.
ఇవీ లక్షణాలు..
హెచ్-1 ఎన్-1 స్ట్రెయిన్ వైరస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, గర్భిణులకు తొందరగా సోకుతుంది. కొవిడ్ వైరస్ మాదిరిగానే గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బాధితులకు దగ్గరగా ఉన్నా సోకే అవకాశాలుంటాయి.
* తీవ్ర జ్వరం
* జలుబు, ముక్కు దిబ్బడ
* ఒంటి నొప్పులు, కీళ్లనొప్పులు
* నీరసంగా మారటం
* తీవ్రంగా దగ్గు ఉండటం
* తీవ్ర తలనొప్పి
జాగ్రత్తలు ఇవీ..
* జనసమ్మర్థ ప్రాంతాల్లో తిరగకుండా ఉండటం
* విధిగా మాస్కులు ధరించటం
* పరిసర ప్రాంతాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం
* ఏమాత్రం అనుమానం ఉన్నా సమీప వైద్య కేంద్రాన్ని సందర్శించాలి
వార్డు ఏర్పాటు
రెండు రోజుల కిందట ఆదిలాబాద్ పట్టణంలోని ఓ మహిళకు స్వైన్ఫ్లూ నిర్ధారణ కావటంతో రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్వైన్ఫ్లూ వార్డు ఇది. ఇందులో 13 పడకలను ఏర్పాటు చేసి ఈ వ్యాధి లక్షణాలున్న వారికి చికిత్సలు అందించటానికి ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని సైతం కేటాయించారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
- రాఠోడ్ జైసింగ్, రిమ్స్ సంచాలకుడు
జిల్లాలో స్వైన్ఫ్లూ కేసు నమోదు కావటంతో అప్రమత్తమయ్యాం. అనుమానితులు, బాధితులకు చికిత్సలు అందించటానికి వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ముందు జాగ్రత్తలు పాటించాలి
- రాఠోడ్ నరేందర్, డీఎంహెచ్ఓ
సుదీర్ఘ కాలానంతరం స్వైన్ఫ్లూ మొదటి కేసు నమోదైంది. ఈ వ్యాధికి కరోనా లాంటి లక్షణాలే ఉంటాయి. జిల్లావాసులు కరోనా సమయంలో పాటించిన ముందు జాగ్రత్తలు పాటిస్తే రక్షణ పొందవచ్చు. జనసమ్మర్థ ప్రాంతాల్లో వెళ్లకుండా ఉండటంతో పాటు మాస్క్ధారణ తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిలాబాద్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని... -
పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు
[ 26-04-2024]
ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంతోపాటు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
తనిఖీల్లో నగదు పట్టివేత
[ 26-04-2024]
ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
[ 26-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. -
26 నుంచి యోగా-ధ్యానం అంశాలపై తరగతులు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా -ధ్యానం అంశాలపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. -
క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..