ఉపాధి సొమ్ములు రాబట్టేందుకు ఆర్ఆర్ యాక్టు ప్రయోగం
ఉపాధి హామీలో వెలుగుచూసిన అక్రమాల నేపథ్యంలో డబ్బుల రికవరీ కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తెలిపారు.
స్త్రీనిధిలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ
కిషన్
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం, ఇచ్చోడ: ఉపాధి హామీలో వెలుగుచూసిన అక్రమాల నేపథ్యంలో డబ్బుల రికవరీ కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తెలిపారు. ఇప్పటికే పది మంది సాంకేతిక సహాయకులపై వేటువేశామన్నారు. డబ్బులు స్వాహా చేసిన సిబ్బంది సమయంలోగా చెల్లించకుంటే వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు మేరకు ఆస్తులు జప్తు చేయించి డబ్బులు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి పరిధిలోని మిగతా అంశాలపై ‘న్యూస్టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.
న్యూస్టుడే: జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేశారు? ఎంత వరకు రికవరీ చేశారు?
డీఆర్డీఓ: ఇప్పటి వరకు మావల, బోథ్, ఆదిలాబాద్, తలమడుగు, తాంసి, భీంపూర్, గుడిహత్నూర్ మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. రూ.3.7 లక్షలు రివకరీ చేశాం. అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నాం.
న్యూస్టుడే: స్త్రీనిధి రుణాల వసూళ్లలో రూ.2 కోట్లకు లెక్కలు లేనట్లు తేలింది. బాధ్యులపై చర్యలెందుకు లేవు?
డీఆర్డీఓ: ఇది 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఇటీవలే దీనిపై విచారణ కోసం పరిశ్రమల అధికారి నేతృత్వంలో కలెక్టర్ ఒక కమిటీని నియమించారు. బాధ్యులను గుర్తించగానే చర్యలు తీసుకుంటాం.
న్యూ: రైతు అద్దె కేంద్రాల కోసం అదనపు పాలనాధికారి ఆధ్వర్యంలోని జిల్లా కొనుగోలు కమిటీని కాదని కొన్ని మండలాల్లో సిబ్బంది ఇతర డీలర్ల వద్ద ట్రాక్టర్లు, వ్యవసాయ పని సామగ్రి కొనుగోలు చేశారు. దీనిపై మీరేమంటారు?
డీఆర్డీఓ: రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పని సామగ్రి అద్దెకు ఇవ్వాలని కేంద్రం మండలానికి రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల నిధులు విడుదల చేసింది. కొనుగోలు కమిటీ సూచించిన డీలర్లు, ఏజెన్సీల వద్దనే వాటిని కొనుగోలు చేయాల్సి ఉండగా మూడు మండలాల్లో వేరే చోట కొనుగోలు చేశారు. అద్దె కుదరకపోవడంతో పరికరాలు వెనక్కి ఇప్పించేశాం. మిగతా మండలాల వారిని సైతం నిబంధనలు పాటించాలని సూచించాం.
న్యూ: ఉపాధి కూలీలకు డబ్బులు సమయంలోగా ఎందుకు చెల్లించడం లేదు?
డీఆర్డీఓ: ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దాదాపు రూ.8 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. నిధులు రాగానే కూలీల ఖాతాల్లో జమచేస్తాం.
న్యూ: స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించడంలో ఆలస్యానికి కారణాలేంటి?
డీఆర్డీఓ: జిల్లాలో 8,755 సంఘాలకు రూ.254 కోట్లు రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటి వరకు 4,048 సంఘాలకు రూ.189 కోట్ల రుణాలు ఇప్పించాం. కొన్నిచోట్ల బ్యాంకర్లు సహకరించడం లేదు. మరికొన్ని చోట్ల సంఘాలు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. ఈ కారణాలతోనే కొంత ఆలస్యమవుతోంది.
న్యూ: సీఎం గిరి వికాసం కింద గిరిజనుల భూముల్లో బోర్లు వేసి కరెంటు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది? ఎందుకు?
డీఆర్డీఓ: జిల్లాలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 9,667 గ్రూపులను తయారు చేశాం. వాటిలో ఇప్పటి వరకు 516 గ్రూపులకు సంబంధించి బోర్లు వేయించాం. ఒక్కో బోరును ఇద్దరి నుంచి నలుగురు రైతులు ఉపయోగిస్తారు. 52 చోట్ల కరెంటు మోటార్లు బిగించాం. కొన్నిచోట్ల విద్యుత్తు అధికారులు సహకరించకపోవడం, మరికొన్నిచోట్ల అటవీ అధికారుల ఇబ్బందులతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బిల్లులు ఇవ్వడంలేదని కొందరు బోర్లు వేయడంలేదు. నిధులు రాగానే అన్నిచోట్ల బోర్లు వేయించి కరెంటు సౌకర్యం కల్పిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే జిల్లా ముందుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోచమ్మ తల్లికి ఎమ్మెల్యే దంపతుల పూజలు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీలో శుక్రవారం నూతన పోచమ్మ ఆలయంలో వేద పండితుల, వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. -
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిలాబాద్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని... -
పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు
[ 26-04-2024]
ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంతోపాటు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
తనిఖీల్లో నగదు పట్టివేత
[ 26-04-2024]
ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
[ 26-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. -
26 నుంచి యోగా-ధ్యానం అంశాలపై తరగతులు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా -ధ్యానం అంశాలపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. -
క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్