మంచి చేశారు.. మదిలో నిలిచారు
ప్రస్తుతం శాసనసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వందల సంఖ్యలో మోటారు సైకిళ్లు, భారీ ర్యాలీలు.. ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో మంది నేతలు వచ్చారు.. వెళ్లారు.. కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఇంకా నిలిచి ఉన్నారు.
న్యూస్టుడే, రాంనగర్, దండేపల్లి
సుద్దవాగుపై నిర్మించిన గడ్డెన్న ప్రాజెక్టు
ప్రస్తుతం శాసనసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వందల సంఖ్యలో మోటారు సైకిళ్లు, భారీ ర్యాలీలు.. ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో మంది నేతలు వచ్చారు.. వెళ్లారు.. కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఇంకా నిలిచి ఉన్నారు. ప్రజలతోపాటు అప్పటి ప్రభుత్వాలు వారు చేసిన సేవలకు గుర్తుగా ప్రాజెక్టులు, కాలనీలకు.. అప్పటి నేతల పేర్లు పెట్టడంతో చిరస్థాయిగా జనంలో నిలిచిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో జనం నోళ్లల్లో ఇప్పటికీ ఉండిపోయారు. శాసనసభల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటి నేతల గుర్తులు, వారి సేవలపై కథనం.
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎంతో మంది నేతలు పోటీ చేశారు. కొంత మంది గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. మరి కొంత మంది మూడు నుంచి ఆరు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ప్రజల అభిమానాన్ని పొందడం, అభివృద్ధికి కృషి చేయడంతో పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తున్నారు. వీరిలో కొంత మంది ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వారి పేర్లు చిరస్మరణీయంగా ఉన్నాయి.
పీపీరావు ప్రాజెక్టు
ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి
గాంధీ
నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు
అంబేడ్కర్
సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది
వివేకానంద
నేతల పేర్లతో ప్రాజెక్టులు
సిర్పూరు నియోజకవర్గంలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన పాల్వాయి పురుషోత్తంరావు 1999లో జరిగిన ఎన్నికల సమయంలో నక్సల్స్ చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన హయాంలో పనులు మొదలు పెట్టిన ఎర్రవాగు ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం పీపీరావు ప్రాజెక్టుగా నామకరణం చేసింది.
ప్రజల అభిమానాన్ని చూరగొన్న మాజీ మంత్రి గడ్డెన్న పేరు అప్పటి నుంచి ఇప్పటి తరం వరకు తెలుసు. మంచి పేరు ఉండటంతో ముథోల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే గడ్డెన్న ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా అయిదు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా సుద్దవాగు ప్రాజెక్టుకు గడ్డెన్న ప్రాజెక్టుగా పేరు మార్చారు.
కడెంకు చెందిన నారాయణ్రెడ్డి జిల్లా ఎంపీగా పని చేశారు. 1998లో హత్యకు గురికావడంతో అప్పటి ప్రభుత్వం ఆయన గుర్తుగా కడెం ప్రాజెక్టుకు నారాయణ్రెడ్డి ప్రాజెక్టుగా పేరు మార్చారు.
సరస్వతి కాల్వ నిర్మాత..
రాజకీయరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ముక్కుసూటి మనిషిగా, సరస్వతి కాల్వ నిర్మాతగా ఆయన ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుంటారు. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో జన్మించిన జీవీ సుధాకర్రావు 1962, 1968లో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 1977లో మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో కడెం జలాశయం ఎండిపోయి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన శ్రీరాంసాగర్ జలాశయం నుంచి కడెం జలాశయంలోకి నీరు వచ్చేలా సరస్వతి కాల్వ నిర్మించడంతో కడెం ఆయకట్టుతోపాటు నిర్మల్ జిల్లాలోని సరస్వతి కాల్వ ఆయకట్టు సస్యశ్యామలంగా మారింది. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. వ్యవసాయ, సాగు నీటి అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు 2006లో వైఎస్ ప్రభుత్వం కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంకు ‘ప్రొఫెసర్ జీవీ సుధాకర్రావు డ్యాం’గా నామకరణం చేసి ఆయన విగ్రహాన్ని అక్కడ నెలకొల్పింది.
వెలుగులు నింపిన ‘జేవీ’
వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాకు విద్యుత్తు సౌకర్యం కల్పించిన ఘనత జేవీ నర్సింగరావుదే.. ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట గ్రామం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్లోని బేగంబజార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల, రోడ్లు, భవనాలు, విద్యుత్శక్తి మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత 1963 నుంచి 1966 వరకు రాష్ట్ర విద్యుత్శక్తి బోర్డు మొట్టమొదటి అధ్యక్షుడిగా పని చేశారు. అదే సమయంలో కొత్తగూడెం సమీపంలోని పాల్వంచ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. 1967లో జరిగిన ఎన్నికల్లో లక్షెట్టిపేట(ప్రస్తుత మంచిర్యాల) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1972లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. హైదరాబాద్లో తెలుగు భాషకు ఆదరణ లేని రోజుల్లో ఆంధ్రోద్యమంలో పాల్గొని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. ఈ ఉద్యమాల ఫలితంగా తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి.
గిరిజనుల హృదయాల్లో..
బోథ్ నియోజకవర్గం నుంచి 1985, 1989లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన గోడం రామారావు.. గిరిజనుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇచ్చోడ పోలీస్స్టేషన్ పక్కన అతని విగ్రహం ఏర్పాటు చేశారు.
వెలిసిన కాలనీలు..
ఎమ్మెల్యేగా చేసిన సేవలతోపాటు వారి హయాంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడంతో పాటు వాటిని పూర్తి చేసి ఇవ్వడంతో.. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో వారికి గుర్తుగా వారి పేర్లతో పలు కాలనీలు వెలిశాయి. జిల్లా మొత్తంలో అనేక నియోజకవర్గాల్లో రాజీవ్, ఇందిర కాలనీలతో పాటు ఎన్టీఆర్ కాలనీలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల స్థానిక నేతలపై అభిమానంతో కాలనీలకు వారి పేర్లు పెట్టుకున్నారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి మంచి మనిషిగా పేరు పొందిన కస్తాల రాంకిష్టు.. 1967లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పేరుతో ఆదిలాబాద్ పట్టణంలో కాలనీ ఏర్పాటు చేశారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన చిలుకూరి వామన్రెడ్డి పేరుతో వామన్నగర్, చిలుకూరి లక్ష్మీనగర్ కాలనీలు ఏర్పాటయ్యాయి. నాలుగు సార్లు గెలుపొందిన రాంచంద్రారెడ్డి పేరుతో కాలనీలు ఉన్నాయి. బోథ్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నగేశ్ పేరుతో సిరికొండ మండలంలో నగేశ్ నగర్ ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయ లేడి
[ 08-05-2024]
ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది. -
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
[ 08-05-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా 62 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు(వి.తులసీరాం, గడ్డం వెంకటస్వామి) రెండు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించారు. -
దారి తప్పిన బాల్యం..
[ 08-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలో కొందరు బాలలు ముఠాగా ఏర్పడి రాత్రయిందంటే చోరీలకు తెగబడటం పట్టణవాసులకు సమస్యగా మారింది. రహదారి పక్కన, మైదానాల్లో ఆశ్రయాలు ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబాలకు చెందిన కొందరు పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి లేదా తెల్లవారుజామున అవకాశం చూసుకొని చోరీలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. -
విద్యుత్తు ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 08-05-2024]
విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. -
ఓటు వేసేదెలా?
[ 08-05-2024]
ఒకవైపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి కదల్లేని వయోవృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో కీలక భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమున్నత లక్ష్యం.. శతశాతం ఓటింగ్తోనే పదిలం
[ 08-05-2024]
ఓటు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాది. వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత చేకూరుతుంది. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు శత శాతం పోలింగ్ నమోదుకు ఎన్నికల సంఘం, వివిధ స్థాయిలో అధికార యంత్రాంగం కార్యక్రమాలు చేపడుతోంది. -
రహదారులకు ప్రాధాన్యం.. ఆరోగ్య భాగ్యం
[ 08-05-2024]
‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రజాసంక్షేమం కోసం పని చేయాలనేది నా ఆశయం. ప్రగతి నా లక్ష్యం. వివాదాలు, విభేదాలు నా విధానం కాదు. ఈ అంశాలే నన్ను ఎంపీగా గెలిపిస్తాయనే నమ్మకం నాకు ఉంది.’’ -
ఆయన ఎన్నికల ఖర్చు రూ.500
[ 08-05-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రతి ఒక్కరికి తెలుసు. వార్డు సభ్యుడు మొదలు ఏ ఎన్నిక జరిగినా డబ్బులు కుమ్మరించాల్సిందే. ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడవుతాయి. -
సెలవులొచ్చాయి.. యువ ఓటర్లు వస్తున్నారు
[ 08-05-2024]
సాధారణంగా చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు వివిధ ప్రాంతాల్లో చదువుకునే యువ ఓటర్లు సొంతూరులో ఉండరు. ఒక వేళ ఓటు వేసేందుకు వద్దామనుకున్నా సెలవులు అంతగా ఉండవు. -
రక్త పిశాచి... చొరవ చూపితేనే విముక్తి
[ 08-05-2024]
తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది. -
పోలింగ్ కేంద్రం దూరం.. అసౌకర్యాల భారం..
[ 08-05-2024]
మరో ఆరు రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా.. -
భారీ వర్షం.. కాస్త ఉపశమనం!
[ 08-05-2024]
తీవ్రమైన ఎండలు, వేసవి తాపం, ఉక్కపోతతో కొన్నిరోజులుగా అల్లాడుతున్న జిల్లావాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
విరమణపై పెదవి విరుపు
[ 08-05-2024]
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్రయోజనాలు (బెనిఫిట్స్) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65ఏళ్లు నిండిన టీచర్కు రూ.లక్ష, సహాయకులకు రూ.50వేలు సహాయం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. -
ఎండ మాయం.. వానతో అపారనష్టం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ నిప్పుల కొలిమిని తలపించినప్పటికీ రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. -
సామాజిక సమీక‘రణం’
[ 08-05-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు. గతకొన్ని రోజుల వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. -
శిశువులపై చిన్నచూపు..
[ 08-05-2024]
ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్) సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే నవజాత శిశువు సంరక్షణ కేంద్రం సదుపాయాలు కరవై, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది. -
మెజార్టీయే లక్ష్యం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. -
ఏటా ఇదే తంతు..
[ 08-05-2024]
కాకతీయ.. ఉన్నత విద్యాప్రమాణాల్లో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన విశ్వవిద్యాలయం. కానీ కొన్నేళ్లుగా తన పనితీరుతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ‘వ్యక్తిగత ప్రయోజనాల’కు ప్రాధాన్యమిస్తూ కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని చరిత్రను మసకబారుస్తున్నాయి.