logo

విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు

జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం వరంగల్ మ్యాక్సీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Published : 28 Mar 2024 12:15 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం వరంగల్ మ్యాక్సీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా  కళ్లద్దాలు  అందజేశారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని వరంగల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ శిబిరానికి విశ్రాంత ఉద్యోగులు,  వారి కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి కంటి పరీక్షలు  చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని