భూ సర్వేకుఅడుగడుగునా ఆటంకాలు
భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో చేపట్టిన భూహక్కు...భూరక్ష కార్యక్రమం సజావుగా సాగడానికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పూర్తిచేయగా రెండోవిడత
బందరు మండల పరిధిలో రైతులతో కలిసి
పొలాల మ్యాప్లు పరిశీలిస్తున్న సర్వేయర్లు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే : భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో చేపట్టిన భూహక్కు...భూరక్ష కార్యక్రమం సజావుగా సాగడానికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పూర్తిచేయగా రెండోవిడత వివిధ మండలాల్లోని గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ సాగుతున్న తరుణంలో లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
29 గ్రామాల్లో రెండో విడత
జిల్లాలో ముందుగా 332 గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ డివిజన్లో జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేట, బందరు డివిజన్లో బందరు మండలంలోని పొట్లపాలెం, నూజీవీడు డివిజన్లో మర్రిబందం, గుడివాడ డివిజన్లో మెరకగూడెం గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. షేర్మహ్మద్పేట 240, పొట్లపాలెం 106, మర్రిబంధం 81, మెరకగూడెంలో 79 సర్వేనంబర్లకు పార్శిల్ సంఖ్యలు కేటాయించారు. రెండో విడతగా గుడ్లవల్లేరు, గన్నవరం, కంచికచర్ల, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఆగిరిపల్లి, పెడన, బందరు మండలాల్లో 29 గ్రామాలను ఎంపిక చేశారు. వీటిల్లో డ్రోన్ మ్యాపింగ్ పూర్తి చేసి సర్వే నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన మండలాల్లోని సర్వేయర్లు అందరితో బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో పొలాలు, ఇళ్ల హద్దులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం వరిపంట లేకపోవడంతో ఎక్కువ గ్రామాల్లో అపరాలు సాగు చేయడంతో సులువుగా హద్దులు గుర్తించి సర్వే వేగవంతం చేయాలని భావించినా ఆశించిన స్థాయిలో సర్వే సాగడం లేదు.
రైతులు అందుబాటులో లేక..
ప్రస్తుతం సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలంటే రైతులు అందుబాటులో ఉండాలి. ఆయా గ్రామాల్లో చాలామంది వృత్తి, వ్యాపారం తదితర కారణాలతో దూర ప్రాంతాల్లో ఉండటంతో సర్వే ఆగి...ఆగి సాగుతుంది. ఊళ్లల్లో భూములు ఉన్న వారు హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వారికి సమాచారం ఇచ్చినా చాలామంది రావడం లేదు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. తొలివిడతలో పూర్తి చేసిన సర్వేకి సంబంధించి అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటికీ ఆ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆయా భూములకు సంబంధించిన రైతులు ఉండాలి...వారి అంగీకారంతో హద్దులు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఎంపిక చేసిన 29 గ్రామాల్లోనూ అనేక మంది భూ యజమానులు లేరు. ఉన్నతాధికారులు మాత్రం సర్వే పూర్తి చేయాలని ఆదేశించడంతో ఏంచేయాలో తెలియక సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ లక్ష్యంలోపు సర్వే సాధ్యం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఫోన్ చేసి పిలిపిస్తున్నాం
రైతులు అందుబాటులో లేకపోవడంతో కొంత సమస్య ఏర్పడుతున్న మాట వాస్తవమే. అయినా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశించిన సమయంలో రెండో విడత సర్వే పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. హద్దులు తేల్చేక్రమంలో ఇరుపక్షాలూ ఉండాలి. అప్పుడే తరువాత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అందుకే ఆయా గ్రామాల్లో అందుబాటులో లేని రైతుల వివరాలు తీసుకుని ఫోన్ చేసి పిలిపిస్తున్నాం. డ్రోన్మ్యాపింగ్ ప్రక్రియ కూడా వేగవంతంగా నిర్వహిస్తున్నాం. సాధ్యమైనంతవరకు లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. - కె.సూర్యారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ
జిల్లాలోని సర్వే నెంబర్లు: 3,15,153
భూమి విస్తీర్ణం: 21,26,798.72
ఎకరాలు రెవెన్యూ గ్రామాలు: 995
మొదటి విడత సర్వే నిర్వహించిన పైలెట్ గ్రామాలు: 4
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాను గెలిపించాలని ఘంటసాలలో ఎన్నారైల ఎన్నికల ప్రచారం
[ 29-04-2024]
అవనిగడ్డ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ ఘంటసాలకు చెందిన ప్రభాస భారతీయులు గొర్రెపాటి రంగనాథ బాబు, మూల్పూరి వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఏపీ ఎన్నికలు.. రేపే తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టో
[ 29-04-2024]
ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. -
నందిగామలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 29-04-2024]
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని రుద్రవరం, సోమవరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తండ్రి హయాం నుంచి డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్: బొండా ఉమా
[ 29-04-2024]
రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. -
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట