Kodali Nani: ఏం.. ‘సేతు’రు నాని..?
అది దశాబ్దాల నాటి కల. సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు.. గత ప్రభుత్వంలో మంజూరు.. అయినా డిజైన్ మార్చాలని పట్టు.. ఎట్టకేలకు కేంద్రం మంజూరు చేసి నిధులు విడుదల చేసినా.. ఇప్పటికీ పనులు ప్రారంభించని వైనం. అదే సమస్య. అక్కడ రైల్వే గేటు పడిందంటే.. వాహనదారులకు హడల్.. గంటల తరబడి నిలబడాల్సిందే.
ఆర్వోబీ నిర్మాణం జరిగేనా..?
గుడివాడ పుర ప్రజల తీరని కల
ఎమ్మెల్యే అనుచరుడికే దక్కిన కాంట్రాక్టు
అది దశాబ్దాల నాటి కల. సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు.. గత ప్రభుత్వంలో మంజూరు.. అయినా డిజైన్ మార్చాలని పట్టు.. ఎట్టకేలకు కేంద్రం మంజూరు చేసి నిధులు విడుదల చేసినా.. ఇప్పటికీ పనులు ప్రారంభించని వైనం. అదే సమస్య. అక్కడ రైల్వే గేటు పడిందంటే.. వాహనదారులకు హడల్.. గంటల తరబడి నిలబడాల్సిందే. గేటు తెరిచిన పావుగంటకే ట్రాఫిక్ వెళ్లక ముందే మళ్లీ గేటు... మరో అరగంట నిరీక్షణ.. ఇదీ గుడివాడ పట్టణంలో వేల మంది ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితి.
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - గుడివాడ గ్రామీణం : గుడివాడ పట్టణం అంటే రాష్ట్రంలోనే ఓ గుర్తింపు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఎంతో మంది ప్రముఖులు విద్యాభ్యాసం చేసిన పట్టణం. అలాంటి పట్టణానికి నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని) ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ఎట్టకేలకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించినా.. నిర్మాణం ప్రారంభించడంలేదు. ఎంపీ చొరవతో ఆకృతులు మార్చి కొత్తగా పరిపాలన అనుమతులు వచ్చినా.. శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినా.. పనులు ప్రారంభించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ స్వయంగా ఎమ్మెల్యే సన్నిహితులు, ఆయన సొంత గ్రామానికి చెందిన వారిదే కావడం విశేషం.
కొన్నేళ్లుగా ఇదే దుస్థితి...
గుడివాడ పట్టణానికి కృష్ణా జిల్లాలోనే గుర్తింపు ఉంది. 1927లోనే ఈ పట్టణం పురపాలక సంఘంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పట్టణ జనాభా 1.60 లక్షల వరకు చేరింది. గుడివాడ పట్టణాన్ని కలుపుతూ రెండు రైలు మార్గాలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఒకటి బందరు వెళుతుంది. మరో రైలు మార్గం నరసాపురం మీదుగా వెళుతుంది. ఈ రెండు మార్గాలు గుడివాడ పట్టణం మధ్య నుంచి వెళుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడ రైల్వే గేటు పడుతుంది. ఒకటి భీమవరం రైల్వేగేటు. ఇది గుడివాడ - భీమవరం రైల్వే మార్గం మీద ఎల్సీ నంబరు 52 వద్ద ఉంది. గుడ్లవల్లేరు మార్గంలో ఉంది. రెండోదీ దీనికి సమీపంలోనే ఉంది. పామర్రు వెళ్లే మార్గంలో బందరు రైల్వే మార్గం. దీని ఎల్ నంబరు మూడు. ఇక్కడ ఆర్వోబీ కట్టాలని దశాబ్దాల నుంచి ప్రతిపాదన ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఆర్వోబీలు నిర్మించారు. ఈరెండు ఆర్వోబీలు జాతీయ రహదారిపై ఉన్నాయి. వీటి నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ ముందుకు వచ్చింది.
తెదేపా హయాంలో రెండు ఆర్వోబీలు
రైల్వే శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. గతంలో ఇవి రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారులు. ఆసంస్థ ఇరువైపులా నిర్మిస్తే.. రైల్వే శాఖ ఆర్వోబీని నిర్మిస్తుంది. దీనికి గతంలోనే తెదేపా హయాంలో రెండు ఆర్వోబీలు ప్రతిపాదించారు. సర్వే చేసి డీపీఆర్ సిద్ధం చేశారు. జాతీయ రహదారి నంబరు 165పై 231.7 కిలోమీటరు వద్ద ఒకటి, 230.6 కిలోమీటరు వద్ద రెండోది నిర్మించాలని నిర్ణయించారు. దీనికి అంచనా వ్యయం రూ.239.55 కోట్లుగా ప్రతిపాదించి మంజూరు చేశారు. కానీ టెండర్లు పిలవకుండా ఆపేశారు. రెండు ఆర్వోబీలు నిర్మాణం వల్ల ఇబ్బందులు ఉంటాయని అవిధంగా కాకుండా ఒకే ఆర్వోబీ ‘వై’ ఆకారంలో నిర్మించాలని ప్రతిపాదించారు. దీని గురించి నేతలు పట్టించుకోలేదు. కేంద్రంలోనూ ఇది పెండింగ్ పడింది. 2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్న కొడాలి నానికి ప్రజలు ప్రతి ఎన్నికల్లో విన్నవించుకుంటునే ఉన్నారు. ప్రతిసారి హామీ ఇస్తూనే న్నారు. కానీ నిర్మాణం గాలికి వదిలేశారు.
పెరిగిన అంచనాలు..
ఆ ఆర్వోబీపై నేతలు ఒక నిర్ణయానికి రావడంలో జాప్యం జరిగింది. దీంతో తాజాగా అంచనాలు సవరించారు. ‘వై’ ఆకృతిలో నిర్మాణానికి అంచనాలు పెరిగాయి. రూ.317.22 కోట్లుగా తేల్చారు. దాదాపు 5.540 కిలోమీటర్ల వరకు పైవంతెన ఉంటుంది. జాతీయ రహదారిపై 228 కి.మీ నుంచి 233.540 కి.మీ వరకు నిర్మించేలా జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదించింది. దీనికి 2022లోనే టెండర్లను పిలిచింది. నిర్మాణ వ్యయంతో పాటు భూసేకరణకు రూ.45 కోట్లు కావాలని అంచనా వేశారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి... కొంత సేకరించారు. 2.40 ఎకరాల భూసేకరణ అవసరమని గుర్తించారు. మొత్తం 130 మంది నిర్వాసితులు ఉన్నారు. కొన్ని భవనాలను కూల్చివేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వంద మందికి రూ.35 కోట్లు వరకు చెల్లించారు. కొంతమంది తమ భవనాలను వారే స్వయంగా కూల్చేసుకున్నారు. మరో 30 మంది నిర్వాసితులకు పరిహారం అందాల్సి ఉంది. ఈ సొమ్ము కూడా జాతీయ రహదారుల సంస్థ రెవెన్యూ శాఖకు చెల్లించింది.
ఆడంబరంగా శిలాఫలకం..
దీనికి ఆడంబరంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పట్టుబట్టడంతో కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆర్వోబీ నిధుల మంజూరు విషయంలో ఎంపీ అనుశీలన చేశారు. టెండర్లు జరిగేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. 2022 డిసెంబరులోనే శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఏడాదిన్నరలో వంతెన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. ఎనిమిది నెలలు గడిచినా పనులు మొదలు కాలేదు. భీమవరం-విజయవాడ మార్గంలో మొత్తం 60 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు 20 సరకు రవాణా రైళ్లు వెళుతున్నాయి. ఒక్క రైలు కోసం కనీసం 10-15 నిమిషాలు గేటు పడుతుంది. అక్కడ ట్రాఫిక్ క్లియర్ కావడానికి కనీసం అరగంట పడుతుంది. అరగంటలో మరోసారి గేటు మూసేస్తున్నారు. మరో మార్గం బందరు-విజయవాడలో 20 రైళ్ల వరకు (సరకు రవాణాతో కలిపి) తిరుగుతున్నాయి. అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది. రెండు గేట్లు ఒకేసారి పడితే.. ట్రాఫిక్ కష్టాలు అన్నీఇన్నీ కావు. సాయంత్రం, ఉదయం వేళల్లో మరీ ఇబ్బందిగా మారుతోంది. నిధులు మంజూరైనా నిర్మాణం ప్రారంభించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి గుడివాడ పట్టణ ప్రధాన సమస్య ఆర్వోబీని పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదేనా గుడివాడ అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు.
గుడివాడ రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిన ట్రాఫిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద