Vijayawada: తెదేపా కార్యకర్తలపై వల్లభనేని వంశీ వర్గీయుల దౌర్జన్యం
నిత్యం గరంగరం, ఉద్రిక్తతంగా ఉండే గన్నవరం రాజకీయం.. ఈసారి విజయవాడ.. అందులోనూ కోర్టు ప్రాంగణం వేదికైంది.
తెదేపా నాయకుడి అన్న కుమారుడు, డ్రైవర్లపై దాడి
విజయవాడలో కోర్టు, పోలీస్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత
సూర్యారావుపేట పోలీసు స్టేషన్ వద్ద బందోబస్తు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - సూర్యారావుపేట : నిత్యం గరంగరం, ఉద్రిక్తతంగా ఉండే గన్నవరం రాజకీయం.. ఈసారి విజయవాడ.. అందులోనూ కోర్టు ప్రాంగణం వేదికైంది. వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, ఆయన సమక్షంలోనే తెదేపా నేతలపై దౌర్జన్యం చేశారు. ఇది చినికి చినికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 2019 నాటి కేసు విచారణ నిమిత్తం విజయవాడలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి హాజరైన గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దీనికి కారణం కాగా, ఆయన అనుచరులు తెదేపాకు చెందిన ఇద్దరు యువకులపై దౌర్జన్యం చేయడంతో వివాదం మొదలైంది. యువకులను వంశీ గన్మెన్ సూర్యారావుపేట పోలీసులకు అప్పగించడంతో తెదేపా శ్రేణులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సూర్యారావుపేట పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఆర్పీఎఫ్ బలగాలను హుటాహుటిన స్టేషన్కు తరలించారు.
2019లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు ప్రసాదంపాడు ఉప సర్పంచి గూడవల్లి నరసింహారావు (నర్సయ్య)లపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత.. ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ వైకాపాలో చేరగా, నర్సయ్య మాత్రం తెదేపాలోనే ఉన్నారు. అప్పటి నుంచి వీరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఎనికేపాడులో నర్సయ్యకు ఉన్న స్థలాన్ని గ్రామీణ తెదేపా కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఇటీవల ప్రసాదంపాడులోని ఆయన ఇంటిపై కొంత మంది దాడి చేసి, కారు అద్దాలు పగలకొట్టారు. దీనికి కొద్ది రోజుల ముందు గన్నవరంలోని ఒక వివాహానికి హాజరు కాగా.. అక్కడ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 నాటి కేసు మంగళవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. దీనికి వంశీ, నర్సయ్యలు హాజరయ్యారు.
వివరాలు తెలుసుకుంటున్న యార్లగడ్డ వెంకట్రావు
ప్రజాప్రతినిధుల కోర్టు ఆవరణలోనే ఘర్షణ
నర్సయ్య కోర్టు హాలులో ఉండగా.. అతని డ్రైవర్ సుబ్బారెడ్డి మంచి నీటి సీసా తీసుకుని వచ్చారు. తిరిగి కోర్టు నుంచి వెళ్తుండగా.. తనను ఫొటోలు తీశాడని వంశీ అనుమానించి తన అనుచరులను అప్రమత్తం చేశారు. వారు సుబ్బారెడ్డిని నిలవరించి చరవాణిని లాక్కున్నారు. ఈలోగా వంశీ గన్మెన్ సూర్యారావుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డ్రైవర్ సుబ్బారెడ్డితో పాటు నర్సయ్య అన్న కుమారుడు గూడవల్లి రవీంద్రను అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న నర్సయ్య.. వెంటనే జరిగిన విషయాన్ని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారి గాయత్రీ దేవి దృష్టికి తీసుకొచ్చారు. తనకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. రాతపూర్వకంగా ఇవ్వాలని మేజిస్ట్రేట్ సూచించడంతో ఇచ్చారు. తనను వంశీ పిలిచి చెంపదెబ్బ కొట్టారని సుబ్బారెడ్డి చెబుతున్నారు. నెలరోజుల్లో అందరినీ ఏరివేస్తామని, ఇప్పటికే ఆలస్యమైందని.. ఇక సహించేది లేదని వంశీ, ఆయన అనుచరులు బెదిరంపులకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపించారు.
స్టేషన్కు భారీగా తరలివచ్చిన శ్రేణులు
నర్సయ్య అన్న కుమారుడు, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సూర్యారావుపేట స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలను పిలిపించారు. గన్నవరం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. వీరిని నియంత్రించేందుకు రాజ్భవన్ వద్ద పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. ఈ లోగా నర్సయ్య పోలీస్స్టేషన్కు చేరుకుని.. ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫొటో తీశారని చెప్పటంతో డ్రైవర్ చరవాణిని తనిఖీ చేశారు. అందులో ఏ విధమైన ఫొటోలు లేకపోవటంతో వంశీ అనుచరులు మాట మార్చేశారు. వంశీని డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎగాదిగా చూశారన్నారు. తాను అలా చూడలేదని సుబ్బారెడ్డి అంటున్నారు. తమ వారిని అకారణంగా కొట్టారంటూ ఆందోళన చేపట్టారు. డీసీపీ కంచె శ్రీనివాసరావు, ఇతర అధికారులు వచ్చి తెదేపా నాయకులతో చర్చించారు. ఆ తర్వాత డ్రైవర్ సుబ్బారెడ్డిని, రవీంద్రను వదిలి పెట్టడంతో వివాదం సద్దుమణిగింది.
మాట్లాడుతున్న గూడవల్లి నర్సయ్య. పక్కన తెదేపా కార్యకర్త, కారు డ్రైవరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా