దండుకోవడానికే ఓటీఎస్.. ప్రయోజనం లేని గృహ హక్కు పత్రాలు
ఏకకాల పరిష్కారం(ఓటీఎస్) సొమ్ము చెల్లించి లబ్ధిదారులు పొందిన ‘గృహహక్కు’ ధ్రుపపత్రాలు(పట్టాలు) ఎందుకూ పనికి రావని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సొమ్ము చెల్లించినా 30 శాతం మందికే జారీ
కంకిపాడు, న్యూస్టుడే
ఏకకాల పరిష్కారం(ఓటీఎస్) సొమ్ము చెల్లించి లబ్ధిదారులు పొందిన ‘గృహహక్కు’ ధ్రుపపత్రాలు(పట్టాలు) ఎందుకూ పనికి రావని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2021 డిసెంబరు నుంచి రెండు నెలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యాలు పెట్టి మరీ సొమ్ము వసూలు చేయడం విదితమే. 52 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతూ దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రచారం చేసింది. దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు’ పథకంగా పేరు పెట్టంది. 2011లోపు వివిధ పథకాల ద్వారా గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను ‘రుణ విముక్తి’ చేయడమే లక్ష్యంగా పేర్కొంది. 15 ఏళ్ల కిందట ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికీ తాఖీదులు అందాయి. గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేల చొప్పున ఒక్కో లబ్ధిదారు నుంచి వసూలు చేశారు.
చెప్పింది ఇదీ!
- లబ్ధిదారుకు ఇంటిపై సర్వహక్కులూ కల్పిస్తారు.
- స్థలానికి గృహాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు..అమ్ముకోవచ్చు..బహుమతిగా ఇవ్వవచ్చు.
- ప్రధానంగా బ్యాంకుల్లో తనఖాపెట్టి రుణాన్ని పొందవచ్చు.
- ఎటువంటి సేవా రుసుములు లేకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.
జరిగింది ఇదీ..
- ఓటీఎస్ కింద సొమ్ము చెల్లించిన 30 శాతం మందికే ‘పట్టాలు’ ఇచ్చారు
- గృహ నిర్మాణానికి రుణాన్ని పొందిన వ్యక్తి మరణించిన సందర్భాలు, అప్పటికే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలు, వారసులు ఒక్కరి కంటే అధికంగా ఉండడం, అప్పటికే ఆరేడు చేతులు మారడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని రోజులు అవగాహన కల్పించి కొందరికి ‘పట్టాలు’ ఇచ్చి ‘మమ’ అనిపించారు
- గతంలో మహిళల పేరుతోనే గృహ రుణాలు మంజూరు చేశారు. 90శాతం పురుషుల పేరుతోనే స్థలాలు ఉన్నాయి. నిబంధనల మేరకు లబ్ధిదారు పేరుతోనే రుణ విముక్తి ధ్రువపత్రాలు ఇచ్చారు. స్థలం కుటుంబ సభ్యులో మరొకరి పేరుతో ఉండడంతో ‘పట్టాలు’ జారీ చేయలేదు. దీనిపై తరచూ మార్గదర్శకాలను మార్చడంతో పట్టాల మంజూరు గందరగోళంగా మారింది.
కొండెక్కిన పట్టాలు
నిర్ధరించిన సొమ్ము వసూళ్లు పూర్తి కాగానే, పథకం అమలును అనధికారికంగా ఆపేశారు. సర్వర్లు పనిచేయలేదని, ‘యాప్’ మూసేశారని, అప్పటికే సమయం మించిపోయిందనే సాకులతో స్వస్తి చెప్పారు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇంతవరకు అందని ఓటీ¨ఎస్ చెల్లింపుదార్లు 70 శాతం ఉండడానికి ఇవే కారణం.
కంకిపాడు మండలం గొడవర్రు వంతన సమీపంలో నివసించే ఎనిమిది మంది ఓటీఎస్ సొమ్ము చెల్లించి పొందిన పట్టాలను కంకిపాడులోని ఆరు ప్రభుత్వ, ప్రైవేటు సహకార బ్యాంకులకు తీసుకువెళ్లి రుణాన్ని అడిగారు. తనఖా పెట్టుకోడానికి ఇవి పనికిరావని తేల్చి చెప్పారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు మేనేజర్ ‘ఇవి నాలుక గీసుకోవడానికీ పనికిరావన్నారు’. ఇదే విషయాన్ని గడప గడపకూ మన ప్రభుత్వంతో మహిళలు ప్రస్తావించారు. బ్యాంకర్లతో మాట్లాడతామని దాట వేశారు. ఇంతవరకు వారికి రుణం మంజూరు కాలేదు. ఇవి తనఖా పెట్టి రుణాన్ని పొందిన దాఖలాలులేవు. దీంతో వారు అంతా మోసం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఒకే స్థలానికి మూడు రిజిస్ట్రేషన్లు?
సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, ఓటీఎస్, ప్రస్తుత భూసంరక్షణ పథకం..ఇలా ఒకే స్థలానికి మూడు రిజిస్ట్రేషన్లు..అవీనీ వివిధ పేర్లతో జారీ అయ్యాయి. ఏది ప్రామాణికమో చెప్పలేని దయనీయ స్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.