గన్న‘వరాల్లేవు’.. శాపాలే.. నియోజకవర్గం వైపు తొంగిచూడని సీఎం జగన్
సీఎం హోదాలో ఉన్న జగన్ గడచిన అయిదేళ్లుగా గన్నవరం నియోజకవర్గం నుంచి తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అది ప్రేమతోనో, అభివృద్ధి కోసమో కాదు..
అయిదేళ్లలో అభివృద్ధి తిరోగమనం
అయినా ఓట్లడిగేందుకు రాక
హనుమాన్జంక్షన్, గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే
సీఎం హోదాలో ఉన్న జగన్ గడచిన అయిదేళ్లుగా గన్నవరం నియోజకవర్గం నుంచి తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అది ప్రేమతోనో, అభివృద్ధి కోసమో కాదు.. కేవలం విమానం ఎక్కి రాష్ట్రమంతటా పర్యటించడానికి మాత్రమే వచ్చి వెళుతుంటారు. 58 నెలలు సీఎంగా ఉన్న ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారికంగా నియోజకవర్గంలో పర్యటించింది లేకపోగా.. చెప్పుకోతగ్గ రీతిలో మచ్చుకు ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి పని చేసిందే లేదు. కానీ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేయడానికి వస్తున్న జగన్, ప్రజలకు ఏం చెబుతారు, ఏమని ఓటడుగుతారనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
గన్నవరం.. నాడు-నేడు
అసంపూర్తిగా నిలిచిన ఐటీ పార్కు రెండో టవర్
ఐటీ తిరోగమనం
2014 నుంచి 2019 మధ్య కాలంలో కేసరపల్లిలో ఉన్న ఐటీ పార్కులో దాదాపు 20కి పైగా సంస్థలు కొలువుదీరాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాయి. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు కొత్త సంస్థ ఒక్కటి రాకపోగా, ఉన్న సంస్థలన్నీ ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఉపాధి అవకాశాలకు గండిపడిపోయింది. శనివారం రాత్రి జగన్ బస కూడా కేసరపల్లి ఐటీ పార్కులో ఎలాంటి పురోగతి లేక మధ్యలోనే ఆగిపోయిన రెండో టవర్ పక్కనే కావడం గమనార్హం.
రహ‘దారుణాలు’..
తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే అత్యధికంగా రహదారులు అభివృద్ధి చేసిన ఘనత దక్కింది. 84 గ్రామ పంచాయతీలకు 70 పంచాయతీల్లో అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్లుగా మార్చారు. ప్రధాన మార్గాలు, అనుసంధాన రహదారులను సైతం పునర్నిర్మించారు. కొన్ని రోడ్లను రవాణా అవసరాలకు వీలుగా విస్తరించారు కూడా. కానీ జగన్ హయాంలో సిమెంట్ రోడ్ల ఊసే లేకపోగా, ప్రధాన, అంతర్గత రహదారులకు నిధులు కేటాయించి కూడా పనులు పూర్తి చేయించలేకపోయారు.
పరిశ్రమలు డీలా
2014-19 మధ్య కాలంలో నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా ఆవిర్భవించింది. వీరపనేనిగూడెం, మల్లవల్లిలో అనేక సంస్థలు తమ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చాయి. మల్లవల్లిలో ఏకంగా 1,360 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడకు రూపకల్పన చేశారు. అశోక్ లేల్యాండ్, పార్లే ఆగ్రో వంటి దిగ్గజ సంస్థలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కానీ వైకాపా అధికారంలోకి రాగానే వీటితో సహా అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి.
ఇళ్ల స్థలాలేవీ?
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న జగన్, నియోజకవర్గంలో దాదాపు ఇంకా 20 వేల మందికి స్థలాలు ఇవ్వకుండా గాలిలో పెట్టేశారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అదిగో పట్టా, ఇదిగో స్థలం అంటూ లబ్ధిదార్లతో దోబుచూలాడి, చివరకు మొండిచెయ్యి చూపారు. ఇచ్చిన లేఔట్లలో కూడా చాలా వాటికి రోడ్డు సౌకర్యమే కల్పించకుండా ‘మమ’ అన్పించారు.
అన్నింట్లోనూ వెనకంజే
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య క్లినిక్ భవనాల నిర్మాణం, రెండో విడత నాడు-నేడు పనులు, జగనన్న లేఔట్లలో మౌలిక వసతుల కల్పన, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి సౌకర్యం కల్పించే పనులు, ఉంగుటూరు వద్ద బుడమేరుపై వంతెన, రామవరప్పాడులో ఏలూరు కాల్వపై వంతెన నిర్మాణాలు, సీఎం సహాయనిధి మంజూరు, మల్లవల్లి పారిశ్రామికవాడ, గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి కీలక పనులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.