logo

ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం

స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్‌ అన్నారు.

Published : 24 Apr 2024 05:29 IST

పెడన, న్యూస్‌టుడే: స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్‌ అన్నారు.అధిక మార్కులు సాధించిన విద్యార్థినులు గ్రీష్మంత్‌ మహి(581), ఊటుకూరి హేమ నాగ విఘ్నేశ్వరి(550), జ్యోతిస్వరూప(546)లను మంగళవారం హైస్కూల్లో ఉపాధ్యాయులు సత్కరించారు. విద్యార్థులు ఉన్నత చదువుల్లో మరింత రాణించి జీవితంలో లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చింతలపాటి నాగేశ్వరరావు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


కంచడం జడ్పీ పాఠశాలలో..

బంటుమిల్లి, న్యూస్‌టుడే : పదోతరగతి ఫలితాల్లో కంచడం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించారని బంటుమిల్లి ఎంఈవో-2 వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు వి.నాగమల్లేశ్వరరావును ఆయన సన్మానించారు. అధిక మార్కులు సాధించిన మువ్వల కావ్యకు బహుమతి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని