సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది.
నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
న్యూస్టుడే, రాజమహేంద్రవరం కలెక్టరేట్: జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. ఆర్వోలు ఉదయం 11 గంటల నుంచి నామపత్రాల స్వీకరణ ప్రారంభించనున్నారు. ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఛాంబర్లో, ఎమ్మెల్యేకి ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దానికనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యలో 21వ తేదీ(ఆదివారం) సెలవు దినం కావడంతో ఆరోజు మాత్రం స్వీకరించరు. ఈ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఊరేగింపుగా రావడాన్ని, నామపత్రాలు సమర్పించడాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తారు. కార్యాలయాల వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు.
ఆంక్షలు.. ధరావతు
అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతిస్తారు. ప్రతిపాదకుడు తప్పకుండా హాజరు కావాలి. మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతావారిని వంద మీటర్ల దూరంలో నిలిపివేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ నియోజవర్గ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
- నామినేషన్ దాఖలుకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.
- పార్లమెంట్కు పోటీచేసే వారు ఫారం-2ఏ, అసెంబ్లీకి ఫారం-2బి దరఖాస్తు చేయాలి.
- గరిష్ఠంగా నాలుగు సెట్లు దాఖలు చేయొచ్చు.
- నామినేషన్ నేరుగా గానీ, ప్రపోజర్ ద్వారాగానీ సమర్పించొచ్చు.
- నామపత్రాలతో పాటు కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
- రెండుకంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి దాఖలు చేయడం కుదరదు.
- సువిధ యాప్ ద్వారా దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాలి.
- ఫారం-26 స్టాంప్ పేపరు విలువ రూ.10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపరు అందుబాటులో లేకుంటే ఈ-స్టాంప్ కూడా ఉపయోగించొచ్చు.
- నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో ఎటు చూసినా మాఫియాలే: షర్మిల
[ 01-05-2024]
ఎటు చూసినా ల్యాండ్, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మాదిగ జాతి ద్రోహి జగన్
[ 01-05-2024]
మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది
[ 01-05-2024]
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్రెడ్డి వెల్లడించారు. -
పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
[ 01-05-2024]
కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు. -
గండాల దారులను గాలికొదిలేశారు!
[ 01-05-2024]
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. -
అభాగ్యులపై పగ.. పంపిణీలో దగా
[ 01-05-2024]
ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. -
మిల్లులో వేలు పెట్టారు.. కార్మికుల పొట్ట కొట్టారు
[ 01-05-2024]
రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం. -
ఆగని అధికార పార్టీ ఆగడాలు
[ 01-05-2024]
ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. -
జగన్ దళితులను దగా చేశారు: గోరంట్ల
[ 01-05-2024]
అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. -
ఇచ్చినవే అమలుకాక.. కొత్తవి గుప్పించలేక..
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు. -
మండపేటలో వారాహి విజయభేరి సభ నేడు
[ 01-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. -
బరి.. గెలుపే గురి
[ 01-05-2024]
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. -
భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?
[ 01-05-2024]
భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేరు మార్పునకు ముద్రగడ సిద్ధంగా ఉండాలి
[ 01-05-2024]
త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. -
బిల్లు.. ఇల్లు ఘొల్లు
[ 01-05-2024]
గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది. -
పరారీలో అధికార పార్టీ నేతలు
[ 01-05-2024]
పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు.