సోయి లేకే ప్రమాదాలు
పరిమితికి మించి మద్యం తాగి విచక్షణ కోల్పోయి కారు అతి వేగంగా నడుపుతుండడంతో నగరంలో తరచూ నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు
పరిమితికి లోబడి తాగితే వాహనం నడపొచ్చు
మోటారు వాహన చట్టం చెబుతోందిదే
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: పరిమితికి మించి మద్యం తాగి విచక్షణ కోల్పోయి కారు అతి వేగంగా నడుపుతుండడంతో నగరంలో తరచూ నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నా వీటికి అడ్డుకట్ట పడడం లేదు. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు ఎంత మద్యం తాగి వాహనాలు నడపొచ్చు? ఎంత తాగితే రక్తంలో ఆల్క్హాల్ శాతం పెరుగుతుంది? అసలు మద్యం తాగి వాహనం నడపడం గురించి మోటారు వాహనం చట్టం ఏమి చెబుతోందని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
30మి.గ్రా దాటితే..
మోటారు వాహన చట్టం 185 ప్రకారం 100 మిల్లీ లీటర్ల రక్తంలో ఆల్కహాల్ గాఢత(బీఏసీ) 30 మిల్లీ గ్రాములలోపే ఆల్క్హాల్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. సంబంధిత వాహనదారుడు నిరభ్యంతరంగా వాహనాన్ని నడపడానికి చట్టం అనుమతి ఇచ్చింది. దీనికి మించితాగి వాహనం నడిపితే నేరం చేసినట్లే. ఒక సాధారణ బీరు తాగిన వ్యక్తి అరగంట లోపులోనే బయటకు వస్తే అతడ్ని పరీక్షిస్తే 30 బీఏసీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మద్యం 30 ఎంఎల్ తాగితే 40 బీఏసీ వస్తుంది. 60 ఎంఎల్ పెగ్గు తాగిన పది నిమిషాల్లోనే రోడెక్కి పోలీసులకు పట్టుబడితే అతని రక్తంలో 100 బీఏసీ ఉంటుందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సాధారణంగా యువత రక్తంలో 150 బీఏసీ ఉంటే చాలా వరకు అతడి మెదడు పని చేయని పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద వారిలో కూడా 150 -200 బీఏసీ ఉంటే పెద్దలు కూడా స్పృహలో ఉండరని చెబుతున్నారు. బార్లో మద్యం తాగిన తర్వాత నాలుగు గంటలపాటు అక్కడే ఉండి బయలుదేరితే బీఏసీ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు తెలిపారు.
నియంత్రణలో ఉంటామనేది భ్రమ: డా.వై.శ్రీనివాస్, హెచ్వోడీ, మానసిక ఆరోగ్య విభాగం, కాకతీయ మెడికల్ కళాశాల
మద్యం తాగేప్పుడు చాలామంది మంది తాము నియంత్రణ కోల్పోం.. బాగా డ్రైవింగ్ చేయగలమని చెబుతుంటారు. ఇదంతా భ్రమ మాత్రమే. పైగా మద్యం తాగినందువల్ల వేగంగా నడుపుతారు. మద్యపానంతో మెదడు నియంత్రణలో ఉండదు. కాళ్లు, చేతులపై పట్టు ఉండదు. ముందు ఏ వాహనం వెళ్తుందో.. ఎంత దూరంలో ఉంటుందో సరైన అంచనా ఉండక ప్రమాదానికి కారణమవుతుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
[ 06-05-2024]
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
[ 06-05-2024]
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు సోమవారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. -
‘ఆఫ్టర్ 9’.. అశ్లీల నృత్యాలు
[ 06-05-2024]
వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు నృత్యాలు చేయిస్తున్న పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పెద్ద సంఖ్యలో యువతులు, కస్టమర్లు, పబ్ సంబంధీకులు కలిపి 172 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
కమలానికి ఆ‘షా’ కిరణం
[ 06-05-2024]
పరేడ్ మైదానంలో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రసంగం కమలం కేడర్కు జోష్నిచ్చింది. -
హోరెత్తిన కూడళ్లు.. కదిలొచ్చిన శ్రేణులు
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రోడ్షోలు...కార్నర్ మీటింగ్లు కార్యకర్తల్లో హుషారు నింపుతున్నాయి. -
ఆఖరి ఆదివారం.. నేతల సపరివారం
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారానికి ఆఖరి ఆదివారం.. వచ్చే శనివారం సాయంత్రమే ప్రచారానికి తెరపడుతున్న వేళ..వచ్చే ఆదివారం ఎక్కడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు. -
ఆ నాలుగూ ఇక్కడే. అధికారులకు సవాలే
[ 06-05-2024]
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలూ రాజధానిలోనే ఉండడం గమనార్హం. -
అగ్రనేతల తాకిడి.. రాజధానిలో సందడి
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడటంతో రాజధాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను అన్ని పార్టీల అగ్రనేతలు చుట్టేస్తున్నారు. -
రూల్స్ మీకే.. మాకు కాదు
[ 06-05-2024]
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్.. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. -
వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలు
[ 06-05-2024]
జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల పరిశీలనలో హైదరాబాద్ జిల్లా పరిధిలో వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు లెక్క తేలింది. -
చేవెళ్లకు అంతర్జాతీయ గుర్తింపు
[ 06-05-2024]
‘‘చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ఏర్పాటై పదిహేనేళ్లయింది. అప్పట్లో శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే ప్రారంభమైంది. -
మా పార్టీకి ప్రత్యర్థులే లేరు
[ 06-05-2024]
‘‘హైదరాబాద్లో సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. కొవిడ్ సమయంలో అన్నార్తులను అదుకున్నాం. నిస్సహాయులకు అండగా నిలబడ్డాం. మా ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలందించాం. అందుకే మాకు ఓటువేయాలని అడుగుతున్నాం’’ -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 06-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. -
అబ్కీ బార్ మోదీ సర్కార్
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అంబర్పేటలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో సికింద్రాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి జి.కిషన్రెడ్డి మాట్లాడారు. -
400..సీట్లు కాదు.. పెట్రోల్ ధర
[ 06-05-2024]
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
త్వరలో శంషాబాద్కు మెట్రో: రంజిత్రెడ్డి
[ 06-05-2024]
చేవెళ్ల లోక్సభ పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్లలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. -
బస్తీ ఓటర్లపైనే అభ్యర్థుల ఆశలు
[ 06-05-2024]
గ్రేటర్లోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్తీ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. -
స్వచ్ఛ.. మోదీ కా పరివార్
[ 06-05-2024]
హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా బెంగళూరు నుంచి ‘మోదీ కా పరివార్’ బృందం వచ్చింది. -
సీఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
[ 06-05-2024]
పేదలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సీఆర్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఏఐజీ హాస్పిటల్స్ వైస్ఛైర్మన్ డాక్టర్ పీవీఎస్ రాజు అన్నారు. -
కాంగ్రెస్ హామీలకు గ్యారంటీ ఎవరు?
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో డీకే అరుణ ఇస్తున్న హామీలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఉన్నారని, మరి కాంగ్రెస్ ఇచ్చే హామీలకు ఎవరు గ్యారంటీ అని మాజీ మంత్రి, భాజపా జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిథర్రెడ్డి అన్నారు. -
మూడోసారీ మోదీయే ప్రధాని: భాజపా
[ 06-05-2024]
దేశంలో మరోసారీ ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. మూడోసారీ ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణం చేయబోతున్నారుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
‘ఎంపీ రంజిత్రెడ్డి పెద్ద స్కాం మాస్టర్’
[ 06-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి స్కాం మాస్టర్ అని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
భానుడి ఉగ్రం.. ప్రాణం భద్రం
[ 06-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు పైబడి నమోదౌతున్నాయి. -
మోదీ పాలనకు చరమగీతం పాడాలి
[ 06-05-2024]
కేంద్రంలో ప్రధాని మోదీ నిరంకుశ పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చరమగీతం పాడాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
[ 06-05-2024]
అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ చౌరస్తాలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మక్బూల్ అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. -
సీజ్ చేసిన నగదులో రూ.4.27 కోట్లు విడుదల
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఆధారాల్లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తున్న ఘటనలపై 153 కేసులు నమోదు కాగా రూ.5,61,02,455 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు స్వాధీనం చేసుకొని జిల్లా గ్రీవెన్స్ కమిటీ (డీజీసీ)కి సిఫార్సు చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?