logo

Suicide: బలవంతంగా చదవలేనని.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

తనకు ఇష్టం లేని చదువును.. బలవంతంగా చదవలేనని ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌ హనుమాన్‌ ఆలయం

Updated : 04 Jan 2022 08:50 IST

జీడిమెట్ల, న్యూస్‌టుడే: తనకు ఇష్టం లేని చదువును.. బలవంతంగా చదవలేనని ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌ హనుమాన్‌ ఆలయం సమీపంలో నివాసముండే బాలుడు(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా.. తల్లిదండ్రులతో తనకు చదవడం ఇష్టం లేదని చెబుతున్నాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. ఈ క్రమంలోనే.. అతడు సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని