కిడ్నీలకు.. కష్టం
మారుతున్న జీవనశైలితో మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు తదితర సమస్యలు మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతున్నాయి. గ్రేటర్లో వారానికి 30-40 వేల డయాలసిస్లు జరుగుతున్నాయి.
గ్రేటర్లో వారానికి 40 వేల వరకు డయాలసిస్లు
ఏటా పెరుగుతున్న బాధితులు
నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం
మారుతున్న జీవనశైలితో మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు తదితర సమస్యలు మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతున్నాయి. గ్రేటర్లో వారానికి 30-40 వేల డయాలసిస్లు జరుగుతున్నాయి. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే 3500 పైనే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. మరో 5 వేల మంది జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ వ్యాధి విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే చాలామందిలో ముప్పు తీసుకొస్తోంది. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కథనం...
రక్తంలోకి చేరిన వ్యర్థాలను వడకడుతూ...ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కిడ్నీలది. జన్యుపరమైన కారణాలతోపాటు అధిక రక్తపోటు, మధుమేహం తదితర కారణాలతో కిడ్నీ జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒకసారి మూత్ర పిండం పనితీరు మందగించి అది విఫలమవటం ప్రారంభమైతే పూర్తిగా నయం చేయడం కష్టం. పైగా చికిత్సకు అయ్యే ఖర్చు సామాన్యులు భరించడం కూడా కష్టమే. ముందే అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పొగతాగడం ఇతరత్రా కారణాలతో ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలకు దారి తీస్తోంది. చివరికి ఇవి కిడ్నీ వ్యాధులకు కారణమవుతున్నాయి. టైప్-1 మధుమేహ బాధితుల్లో 10-30 శాతం, టైప్-2 మధుమేహ బాధితుల్లో 40 శాతం మంది కిడ్నీ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. సమస్యను తొలి దశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది.
- ఈనాడు, హైదరాబాద్
మార్పిడి తర్వాత వివాహం చేసుకున్నా
2003లో ఈ సమస్యతో మా చెల్లెలు చనిపోయింది. 2006లో నాకూ ఇబ్బంది తలెత్తింది. 2012లో మా పిన్ని నాకు కిడ్నీ దానం చేసి మరో జన్మ ప్రసాదించారు. తర్వాత నేను వివాహం చేసుకున్నా. మాకు ఒక పాప. ఉద్యోగం కూడా చేస్తున్నా. నాలాంటి వారికి ధైర్యం కల్పించడానికి ఒక సామాజిక మాధ్యమంలో వేదిక ఏర్పాటు చేశా. ప్రస్తుతం అందులో వేయిమంది ఉన్నారు. రోగులకు ప్రభుత్వం నుంచి పింఛను లాంటివి మంజూరు చేయాలి.
- భగవాన్రెడ్డి, చేయూత ఫౌండేషన్
భార్య కిడ్నీ దానంతో జీవం పోసుకున్న భర్త
ఎల్బీనగర్, న్యూస్టుడే: ఎల్బీనగర్లో డా.మనోహరన్(64), జయలలిత(54) దంపతులు నివాసముంటున్నారు. ఆయన ఎస్బీఐలో చీఫ్ మేనేజరుగా 2014లో పదవీ విరమణ పొందారు. డీఆర్డీఎల్లో డా.అబ్దుల్ కలాంతో పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత బ్యాంకులో ఉద్యోగిగా చేరారు. 1994లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆ సమయంలో వైద్యులు కిడ్నీ మార్పిడి చేస్తేనే బతుకుతారని చెప్పడంతో దాత కోసం వెతికారు. తనకు సరిపడేది ఎవరి వద్ద లభించలేదు. చివరకు ప్రేమించి వివాహం చేసుకున్న భార్య ఆదుకున్నారు. ఆమె కిడ్నీ దానం చేయడంతో జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో 1994లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. భార్యభర్తలు ఇద్దరూ నేటికి ఆరోగ్యంగా ఉన్నారు.
నిరంతర అప్రమత్తత అవసరం
నిరంతర అప్రమత్తతతో కిడ్నీ జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్ఛు అధిక రక్తపోటు, మధుమేహం రోగులు కనీసం మూడు నెలలకు ఒకసారైనా పరీక్షలు చేసుకోవాలి. అతి తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నట్లు తేలింది. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇక పెద్ద వాళ్లు సైతం మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యుల సూచనలు లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు.
- డాక్టర్ శ్రీభూషణ్రాజు, మూత్రపిండ నిపుణులు, నిమ్స్
ఇవి గమనిస్తున్నారా...
మూత్రంలో ఆల్బుమిన్ ఎక్కువగా పోతుంటే అప్రమత్తం కావాలి. ఇది ఒక రకం ప్రోటీన్. సుద్దలా ఉంటుంది. ఇది ఎక్కువగా పోతుంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతున్నట్టే. రక్తంలో సీరమ్ క్రియాటిన్ మాత్రమే కాకుండా ఎస్టిమేటడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్(ఈజీఎఫ్ఆర్) లెక్కించాలి. ఇది 110 మిల్లీ వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కంటే తగ్గితే సమస్య ఉన్నట్లే. మధుమేహం ఉంటే హెచ్బీఏ1సీ 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ 130/80 దాటకుంటే ఉత్తమం.
-డా.అరవింద్రెడ్డి, నెఫ్రాలజిస్టు, నిమ్స్ మనోహరన్, జయలలిత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్రాలో ఓటుంది.. తపాలా ఓటును పంపండి
[ 05-05-2024]
నగరంలో ఎన్నికల విధులకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగంపై అయోమయంలో పడ్డారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్కు వరుస కట్టిన వినతులే అందుకు నిదర్శనం. -
టక్కరి దొంగ.. పోలీసులతోనే ఉపాధి పొంది మస్కా కొట్టి చోరీలు
[ 05-05-2024]
అతను దొంగ.. సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు.. నిజంగా మార్పు రాలేదు. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
[ 05-05-2024]
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
పజ్జన్న అంటే ప్రజల మనిషని తెలుసు
[ 05-05-2024]
జనంలో ఉండే నేతకే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
అన్నీ ఒకేచోట.. ఇబ్బంది లేదిక
[ 05-05-2024]
ఇంధనాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త బంకులు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతుండటంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పారు. -
ఒకటిన్నర ఎకరా మించితే.. టీడీఆర్ కష్టం
[ 05-05-2024]
అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టి టీడీఆర్ (అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇచ్చే ప్రక్రియపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. -
అదనంగా 60శాతం ఈవీఎంలు
[ 05-05-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో..ఎన్నికల అధికారులు 60శాతం ఈవీఎంలను అదనంగా తెప్పించారు. -
రాళ్లే బద్దలవుతుంటే.. రికార్డులెంత
[ 05-05-2024]
నగరంలో రోజురోజుకు భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
ఆనాటి బరిలో ఇద్దరే
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్నపుడు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 40మంది కంటే ఎక్కువగా బరిలో ఉంటున్నారు. కానీ 1957 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కేవలం ఇద్దరు అభ్యర్థులే బరిలో నిలిచారు. -
మండుటెండల్లో.. ఠండా పానీ
[ 05-05-2024]
చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది. -
ముమ్మరంగా నేతల ప్రచారాలు
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీగౌడ్, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. -
ప్రజాశ్రేయస్సే అధికారులకు పరమావధి కావాలి
[ 05-05-2024]
సివిల్ సర్వీసెస్ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. -
దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణే
[ 05-05-2024]
దేశంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి విజయవంతంగా అమలుచేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
‘అల్లాహ్ మీద ఒట్టు.. జీవితంలో ఎవరిపై జులుం చేయలేదు’
[ 05-05-2024]
మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ సర్కారును ఓడించేందుకు అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. -
గెలుపు, ఓటమికి మధ్య నోటా దోబూచులాట!
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశం నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్). -
పోటీ త్రిముఖం.. ప్రచారం బహుముఖం
[ 05-05-2024]
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఈసారి పేరుకే 43 మంది బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, భాజపా, భారాసల మధ్యే ‘త్రిముఖ’ పోటీ నెలకొంది. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
కలిసికట్టుగా ‘కొండా’ను గెలిపిద్దాం: భాజపా
[ 05-05-2024]
ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్ అన్నారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రాణం తీసిన.. ఫొటో సరదా..
[ 05-05-2024]
క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది. -
ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది. -
శంషాబాద్లో చిక్కిన చిరుత అమ్రాబాద్కు తరలింపు
[ 05-05-2024]
శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాప్ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు. -
క్రిశాంక్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 05-05-2024]
భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న