నిమిషాల్లో ఓఆర్ఆర్పైకి!
ఐటీ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించే వంతెనల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. పెరగనున్న ఉద్యోగులు, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద మరిన్ని పైవంతెనలు,
ఐటీ నగరిలో వేగంగా పైవంతెనల నిర్మాణం
శిల్పా లేఅవుట్ పైవంతెన
ఈనాడు, హైదరాబాద్: ఐటీ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించే వంతెనల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. పెరగనున్న ఉద్యోగులు, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద మరిన్ని పైవంతెనలు, అండర్పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఐకియాకు పక్కగా డెలాయిట్ సంస్థ వెనుక వైపునున్న రోడ్డును 120 అడుగుల మేర విస్తరించి ఎత్తైన భవనాల మధ్య నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ పైకి పైవంతెన నిర్మాణమవుతోంది. పనులు 90 శాతం పూర్తయ్యాయి. ‘వై’ ఆకారంలో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం.. గచ్చిబౌలి పైవంతెన మీదుగా వెళ్లి ఓఆర్ఆర్కు రెండువైపులా నేలకు తాకుతుంది. మైండ్స్పేస్ కూడలి, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీ సంస్థలు, నివాస సముదాయాల నుంచి 5 నిమిషాల్లో ఓఆర్ఆర్ను చేరుకునేలా ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది. ఆగస్టు 15కు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం.
ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపు.. శిల్పా లేఅవుట్ పైవంతెనతోపాటు ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపు మరో పైవంతెన నిర్మాణమవుతోంది. ఆరు లైన్ల వెడల్పుతో నిర్మాణమయ్యే ఈ పైవంతెనపై రెండు వైపులా రాకపోకలుంటాయి. ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, మియాపూర్ మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది. పనులు పూర్తయ్యేందుకు రెండేళ్లు పడుతుందని అంచనా.
కొత్తగూడ కూడలిపై.. గచ్చిబౌలి నుంచి కొండాపూర్, మియాపూర్ వెళ్లే వాహనాల కోసం జీహెచ్ఎంసీ కొత్తగూడ కూడలి వద్ద పైవంతెనను నిర్మిస్తోంది. ఇది ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్ వద్ద, బొటానికల్ గార్డెన్ కూడలికి ముందు మొదలై కొత్తగూడ కూడలి మీదుగా కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు సాగుతుంది. బొటానికల్ గార్డెన్ రోడ్డు మీదుగా వచ్చి కొండాపూర్, మియాపూర్ వెళ్లే వాహనాలూ ఈ వంతెనను ఉపయోగించుకునేలా అప్ ర్యాంపు నిర్మిస్తున్నారు. పనులు దాదాపు తుది దశకు వచ్చాయి. ఈ వంతెన ఎక్కిన వాహనాలు శిల్పారామం రోడ్డుపైకి కూడా దిగొచ్చు. అందుకోసం కొత్తగూడ కూడలిలో డౌన్ ర్యాంపు నిర్మాణమవుతోంది. ఇక మియాపూర్, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి, ఓఆర్ఆర్ వెళ్లే వాహనాల కోసం కొత్తగూడ కూడలిలో అండర్పాస్ నిర్మాణమైంది. మొత్తం ప్రాజెక్టు మరో 2 నెలల్లో పూర్తవనుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
నెలలో కైత్లాపూర్ ఆర్వోబీ.. కూకట్పల్లి, బోయినపల్లి, మూసాపేట ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ మధ్య రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు తొలగించే కైత్లాపూర్ ఆర్వోబీ నిర్మాణ పనులు వచ్చే నెలలో పూర్తికానున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.
నిర్మాణాల వ్యయం
* బొటానికల్ గార్డెన్-కొత్తగూడ కూడలిపై నిర్మించే పైవంతెన: రూ.263 కోట్లు
* శిల్పాలేఅవుట్ పైవంతెన: 225.50 కోట్లు
* ఓఆర్ఆర్-బొటానికల్ గార్డెన్ రోడ్డు పైవంతెన: రూ.209.5 కోట్లు
* కైత్లాపూర్ ఆర్వోబీ: రూ.83.06 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆఫ్టర్ 9’.. అశ్లీల నృత్యాలు
[ 06-05-2024]
వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు నృత్యాలు చేయిస్తున్న పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పెద్ద సంఖ్యలో యువతులు, కస్టమర్లు, పబ్ సంబంధీకులు కలిపి 172 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
కమలానికి ఆ‘షా’ కిరణం
[ 06-05-2024]
పరేడ్ మైదానంలో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రసంగం కమలం కేడర్కు జోష్నిచ్చింది. -
హోరెత్తిన కూడళ్లు.. కదిలొచ్చిన శ్రేణులు
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రోడ్షోలు...కార్నర్ మీటింగ్లు కార్యకర్తల్లో హుషారు నింపుతున్నాయి. -
ఆఖరి ఆదివారం.. నేతల సపరివారం
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారానికి ఆఖరి ఆదివారం.. వచ్చే శనివారం సాయంత్రమే ప్రచారానికి తెరపడుతున్న వేళ..వచ్చే ఆదివారం ఎక్కడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు. -
ఆ నాలుగూ ఇక్కడే. అధికారులకు సవాలే
[ 06-05-2024]
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలూ రాజధానిలోనే ఉండడం గమనార్హం. -
అగ్రనేతల తాకిడి.. రాజధానిలో సందడి
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడటంతో రాజధాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను అన్ని పార్టీల అగ్రనేతలు చుట్టేస్తున్నారు. -
రూల్స్ మీకే.. మాకు కాదు
[ 06-05-2024]
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్.. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. -
వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలు
[ 06-05-2024]
జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల పరిశీలనలో హైదరాబాద్ జిల్లా పరిధిలో వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు లెక్క తేలింది. -
చేవెళ్లకు అంతర్జాతీయ గుర్తింపు
[ 06-05-2024]
‘‘చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ఏర్పాటై పదిహేనేళ్లయింది. అప్పట్లో శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే ప్రారంభమైంది. -
మా పార్టీకి ప్రత్యర్థులే లేరు
[ 06-05-2024]
‘‘హైదరాబాద్లో సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. కొవిడ్ సమయంలో అన్నార్తులను అదుకున్నాం. నిస్సహాయులకు అండగా నిలబడ్డాం. మా ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలందించాం. అందుకే మాకు ఓటువేయాలని అడుగుతున్నాం’’ -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 06-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. -
అబ్కీ బార్ మోదీ సర్కార్
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అంబర్పేటలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో సికింద్రాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి జి.కిషన్రెడ్డి మాట్లాడారు. -
400..సీట్లు కాదు.. పెట్రోల్ ధర
[ 06-05-2024]
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
త్వరలో శంషాబాద్కు మెట్రో: రంజిత్రెడ్డి
[ 06-05-2024]
చేవెళ్ల లోక్సభ పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్లలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. -
బస్తీ ఓటర్లపైనే అభ్యర్థుల ఆశలు
[ 06-05-2024]
గ్రేటర్లోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్తీ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. -
స్వచ్ఛ.. మోదీ కా పరివార్
[ 06-05-2024]
హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా బెంగళూరు నుంచి ‘మోదీ కా పరివార్’ బృందం వచ్చింది. -
సీఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
[ 06-05-2024]
పేదలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సీఆర్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఏఐజీ హాస్పిటల్స్ వైస్ఛైర్మన్ డాక్టర్ పీవీఎస్ రాజు అన్నారు. -
కాంగ్రెస్ హామీలకు గ్యారంటీ ఎవరు?
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో డీకే అరుణ ఇస్తున్న హామీలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఉన్నారని, మరి కాంగ్రెస్ ఇచ్చే హామీలకు ఎవరు గ్యారంటీ అని మాజీ మంత్రి, భాజపా జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిథర్రెడ్డి అన్నారు. -
మూడోసారీ మోదీయే ప్రధాని: భాజపా
[ 06-05-2024]
దేశంలో మరోసారీ ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. మూడోసారీ ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణం చేయబోతున్నారుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
‘ఎంపీ రంజిత్రెడ్డి పెద్ద స్కాం మాస్టర్’
[ 06-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి స్కాం మాస్టర్ అని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
భానుడి ఉగ్రం.. ప్రాణం భద్రం
[ 06-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు పైబడి నమోదౌతున్నాయి. -
మోదీ పాలనకు చరమగీతం పాడాలి
[ 06-05-2024]
కేంద్రంలో ప్రధాని మోదీ నిరంకుశ పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చరమగీతం పాడాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
[ 06-05-2024]
అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ చౌరస్తాలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మక్బూల్ అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. -
సీజ్ చేసిన నగదులో రూ.4.27 కోట్లు విడుదల
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఆధారాల్లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తున్న ఘటనలపై 153 కేసులు నమోదు కాగా రూ.5,61,02,455 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు స్వాధీనం చేసుకొని జిల్లా గ్రీవెన్స్ కమిటీ (డీజీసీ)కి సిఫార్సు చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు