logo

తెలుగు జాతి ఖ్యాతిని చాటిన ఎన్టీఆర్‌

దివంగత ఎన్టీఆర్‌ అభిమానులు తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. సైదాబాద్‌ సామాజిక భవనంలో మంగళవారం అఖిల భారత

Published : 10 Aug 2022 02:45 IST

సైదాబాద్, న్యూస్‌టుడే: దివంగత ఎన్టీఆర్‌ అభిమానులు తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. సైదాబాద్‌ సామాజిక భవనంలో మంగళవారం అఖిల భారత నందమూరి తారక రామారావు అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ అభిమానుల ఆత్మీయ కలయిక, శత జయంతి ఉత్సవాల్ఠు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ ఛైర్మన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ తెతెదేపా ఇన్‌ఛార్జి నాగు నగేష్‌ అధ్యక్షత వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం నర్సింహులు మాట్లాడుతూ.. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో పోటీ, అభ్యర్థి ఎంపిక విషయాల్లో తుది నిర్ణయం అధినేత చంద్రబాబునాయుడిదేనని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని