logo

కళ్లెదుటే కన్నకూతురి దుర్మరణం

బైకును ఓ వాహనం ఢీకొన్న ఘటనలో కన్న తండ్రి కళ్లెదుటే కుమార్తె దుర్మరణం పాలైంది. పటాన్‌చెరు ఎస్సై ప్రసాదరావు వివరాల ప్రకారం రామచంద్రాపురం ఎంఐజీకి చెందిన జాఫర్‌ డ్రైవర్‌. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Published : 12 Aug 2022 03:56 IST

పటాన్‌చెరు అర్బన్‌: బైకును ఓ వాహనం ఢీకొన్న ఘటనలో కన్న తండ్రి కళ్లెదుటే కుమార్తె దుర్మరణం పాలైంది. పటాన్‌చెరు ఎస్సై ప్రసాదరావు వివరాల ప్రకారం రామచంద్రాపురం ఎంఐజీకి చెందిన జాఫర్‌ డ్రైవర్‌. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రేష్మాబేగమ్‌ (17) ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్‌ చదువు మధ్యలోనే ఆపేసింది. కొంతకాలంగా సైనస్‌తో ఇబ్బంది పడుతోంది. సంగారెడ్డిలో ఉన్న ఈఎన్‌టీ ఆసుపత్రిలో చూపించుకునేందుకు తండ్రి జాఫర్‌తో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. ముత్తంగి చర్చి సమీపంలో గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొంది. రేష్మాబేగమ్‌ తీవ్రంగా గాయపడి తండ్రి కళ్ల ముందే దుర్మరణం పాలైంది. జాఫర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని