logo

కాంగ్రెస్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మరు: కొండా

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చేవెళ్ల పట్టణ కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు.

Updated : 10 May 2024 05:45 IST

మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌ రెడ్డి

చేవెళ్ల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చేవెళ్ల పట్టణ కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే గ్యారంటీ పథకాలంటూ కాంగ్రెస్‌ ప్రజల ముందుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానానికి చేరిందని తెలిపారు. మోదీ వంటి శక్తివంతమైన నాయకుడు భారత్‌కు ప్రధానిగా అవసరమని చెప్పారు. సుస్థిర ప్రభుత్వం కోసం ఓటర్లంతా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. రోడ్‌ షోలో భాజపా జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, విజయలక్ష్మి, కంజర్ల ప్రకాష్‌, ప్రతాప్‌రెడ్డి, పాండురంగారెడ్డి, అనంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకట్‌ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని