logo

అడవి బాపిరాజు విభిన్న ప్రక్రియల్లో ప్రతిభావంతుడు

అడవి బాపిరాజు విభిన్న ప్రక్రియల్లో ప్రతిభావంతుడని రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దేవి ప్రసాద్‌ కొనియాడారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో గానసభ....

Published : 24 Sep 2022 03:13 IST


మాట్లాడుతున్న దేవి ప్రసాద్‌. చిత్రంలో మధుసూదన్, కళాజనార్దనమూర్తి, సుబ్బారావు, మాధవ్‌

గాంధీనగర్‌ , న్యూస్‌టుడే: అడవి బాపిరాజు విభిన్న ప్రక్రియల్లో ప్రతిభావంతుడని రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దేవి ప్రసాద్‌ కొనియాడారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో గానసభ ప్రధాన వేదికలో ప్రముఖ సాహితీవేత్త అడవి బాపిరాజు జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గానసభ అధ్యక్షులు కళాజనార్దనమూర్తి మాట్లాడుతూ బాపిరాజు రచించిన గోన గన్నారెడ్డి నవలలో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయన్నారు. విశ్రాంత జడ్జి మధుసూదన్, సుబ్బారావు, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని